News March 10, 2025
తిరుపతి జిల్లాలో మొదలైన భానుడి ప్రతాపం

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండల దెబ్బకు సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకండ్రిగ తదితర ప్రాంతాలలో ఉదయం 11 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వయస్సు పైబడిన వారు పని ఉంటే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News December 1, 2025
వనపర్తి: మిల్లర్లు పెండింగ్ సీఎంఆర్ ధాన్యాన్ని వేగంగా అప్పగించాలి

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు రైస్ మిల్లర్లు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం.ఆర్.)ను ఎప్పటికప్పుడు వేగంగా పూర్తి చేసి ప్రభుత్వానికి డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం మదనాపురం మండల పరిధిలోని భాను ట్రేడర్స్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిల్వలను అదనపు కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
News December 1, 2025
మక్తల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చరిత్ర నిర్ణయాలు: మంత్రి

మక్తల్ ప్రాంత అభివృద్ధి దశాబ్దాలుగా మాటల్లోనే మిగిలిపోయిందని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. కృష్ణా నది పక్కన ఉన్నా వ్యవసాయానికి నీరు లేక ప్రజలు వలసబాట పట్టే పరిస్థితి ఎదురయ్యేదని గుర్తుచేశారు. అయితే సీఎంరేవంత్ రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 5 వేల కోట్లతో, లక్ష ఎకరాలకు నీరు చేరేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి “అపర భగీరథుడు” అన్నారు. ముఖ్యమంత్రికి శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.
News December 1, 2025
MNCL: బహిరంగంగా మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు

మంచిర్యాల జోన్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ఆగడాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు ఈ నెల 1 నుంచి జనవరి 1 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.


