News March 10, 2025
తిరుపతి జిల్లాలో మొదలైన భానుడి ప్రతాపం

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండల దెబ్బకు సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకండ్రిగ తదితర ప్రాంతాలలో ఉదయం 11 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వయస్సు పైబడిన వారు పని ఉంటే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News November 18, 2025
AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

ఉద్యోగ మార్కెట్పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్ఎంప్లాయిమెంట్ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.
News November 18, 2025
AIతో 20 శాతానికి పెరగనున్న నిరుద్యోగిత: ఆంత్రోపిక్ CEO డారియో

ఉద్యోగ మార్కెట్పై AI ప్రభావం కచ్చితంగా ఉంటుందని ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో సగం ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందన్నారు. భవిష్యత్తులో అన్ఎంప్లాయిమెంట్ను 10 నుంచి 20 శాతానికి పెంచుతుందని అంచనా వేశారు. కన్సల్టింగ్, లా, ఫైనాన్స్ వంటి ప్రొఫెషన్స్కూ రిస్క్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రంగాల్లో AI మోడల్స్ బాగా పనిచేస్తున్నాయని చెప్పారు.
News November 18, 2025
భారత జలాల్లోకి చొరబడ్డ 79మంది బంగ్లా మత్స్యకారుల అరెస్టు

మన సముద్ర జలాల్లోకి అక్రమంగా చొరబడ్డ 79 మంది బంగ్లాదేశ్ మత్స్యకారుల్ని మారిటైమ్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో ఇంటర్నేషనల్ మారిటైమ్ బౌండరీలైన్ దాటి ఇండియన్ EEZ పరిధిలోకివచ్చిన 3 విదేశీ బోట్లను, చొరబాటుదార్లను సిబ్బంది పట్టుకున్నారు. ICGS రొటీన్ విజిలెన్సు కొనసాగిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న బోట్లను గుర్తించారు. బౌండరీ లైన్ దాటి 2 నాటికల్ మైళ్లు లోపలకు వచ్చారు.


