News March 10, 2025
తిరుపతి జిల్లాలో మొదలైన భానుడి ప్రతాపం

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఎండల దెబ్బకు సత్యవేడు, వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకండ్రిగ తదితర ప్రాంతాలలో ఉదయం 11 గంటలకే రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంటూ స్థానికులు వాపోతున్నారు. వయస్సు పైబడిన వారు పని ఉంటే తప్ప బయటకు రావద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. మీ ప్రాంతంలోనూ ఇలాగే ఉంటే కామెంట్ చేయండి.
Similar News
News November 13, 2025
స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. 2,3 రోజుల్లో క్లారిటీ

TG: రేపటితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముగియనుండటంతో లోకల్ బాడీ ఎలక్షన్స్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై 2,3 రోజుల్లో CM రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా వ్యాఖ్యానించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంలో కోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. రిజర్వేషన్లను కోర్టు అంగీకరించకపోతే పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లనుంది.
News November 13, 2025
జూబ్లీహిల్స్: రేపు వైన్స్ బంద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు ఉదయం నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని అధికారులు మరోసారి గుర్తు చేశారు. వైన్స్, బార్లు, కల్లు కంపౌండ్లు మూసివేయాలని ఆదేశించారు. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉన్నందున పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం వైన్స్ తెరుచుకోనున్నాయి. SHARE IT
News November 13, 2025
అమలాపురం: వ్యభిచార గృహంపై దాడి

అమలాపురంలో పట్టాభి స్ట్రీట్లో ఓఇంట్లో వ్యభిచారం సాగుతోందని పోలీసులు గుర్తించారు. కొంతమంది అండతో పాయసం వెంకట రమణ ఇద్దరు అమ్మాయిలతో ఈ వ్యాపారం నిర్వహిస్తోందని సమాచారంతో సీఐ వీరబాబు బుధవారం రాత్రి దాడి చేశారు. ఇద్దరు అమ్మాయిలతో పాటు నలుగురు విటులు అదుపులోకి తీసుకోగా, 2 వేల నగదు, 5 కండోమ్లను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు టౌన్ సీఐ వీరబాబు గురువారం తెలిపారు.


