News February 18, 2025
తిరుపతి జిల్లాలో రిపోర్టర్లు కావలెను

తిరుపతి జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
Similar News
News November 15, 2025
ఓడిపోయినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి

TG: జూబ్లీహిల్స్లో ఓడిపోయినా KTRకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘నువ్వే అభ్యర్థి లాగా తిరిగావ్. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినా ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదు. మా అభ్యర్థికి 25వేల మెజారిటీ వస్తే బొటాబొటీతో గెలిచారు అంటున్నావ్. నీకు సిగ్గు లేదా. ఆత్మపరిశీలన చేసుకో. నీతోనే BRS పతనం అవ్వడం ఖాయం’ అని మీడియా సమావేశంలో మండిపడ్డారు.
News November 15, 2025
కామారెడ్డి: ప్రభుత్వ పీజీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

కామారెడ్డిలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుతం కళాశాలలో MA (ఇంగ్లీష్, తెలుగు, ఎకనామిక్స్,పొలిటికల్ సైన్స్), MSW, MCom, MSc (బాటని, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఫిషరీస్) మొత్తం 12 కోర్సుల్లో మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
News November 15, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఏ ఎన్నికలైనా బిహార్ లాంటి ఫలితాలే NDAకు వస్తాయి: బీజేపీ ఎంపీ పురందీశ్వరి
* లిక్కర్ కేసులో అరెస్టయిన అనిల్ చోఖ్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.
* సింగపూర్-విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి.
* పరకామణి కేసులో సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. గుంతకల్ రైల్వే స్టేషన్లో అతని బైక్ను పోలీసులు గుర్తించారు.


