News February 18, 2025

తిరుపతి జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

తిరుపతి జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

Similar News

News October 21, 2025

పాక్ ODI కెప్టెన్‌గా రిజ్వాన్ తొలగింపు.. కారణం ఇదేనా?

image

పాక్ ODI కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్‌ స్థానంలో షహీన్ అఫ్రీదిని నియమించిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడానికి నిరాకరించినందుకే రిజ్వాన్‌ను తొలగించినట్లు పీసీబీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతడు బెట్టింగ్ యాప్స్ లోగో ఉన్న జెర్సీని ధరించడానికి ఒప్పుకోలేదు. మరోవైపు పాలస్తీనా మద్దతుగా చేసిన వ్యాఖ్యలూ ప్రభావం చూపాయని సమాచారం.

News October 21, 2025

విశాఖకు గూగుల్ రావడం జగన్‌కు ఇష్టం లేదనిపిస్తోంది: మాధవ్

image

AP: విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును స్వాగతిస్తూ YS జగన్‌ కనీసం ట్వీట్ కూడా చేయలేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆక్షేపించారు. గూగుల్ పెట్టుబడులు రావడం ఆయనకు ఇష్టం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తుంటే ఎందుకు స్వాగతించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయని, డబుల్ ఇంజిన్ సర్కారు ఫలితాలు రుచిచూపిస్తున్నామని చెప్పారు.

News October 21, 2025

పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి: రాచకొండ సీపీ

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. అంబర్‌పేట్ కార్ హెడ్‌క్వార్టర్‌లో సీపీ సుధీర్ బాబు, డీసీపీలు, సీనియర్ అధికారులతో కలిసి పోలీస్ అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్ఛాలు సమర్పించి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుందని తెలిపారు.