News October 16, 2024
తిరుపతి జిల్లాలో రేపు సెలవు

తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇవాళ జిల్లాకు రెడ్ జోన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది రేపు కూడా కొనసాగే అవకాశం ఉంది. దీంతో కలెక్టర్ వేంకటేశ్వర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు గురువారం సెలవు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
Similar News
News October 30, 2025
బాధిత కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ సాయం

ప్రమాదాలకు గురైన పోలీసు కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ గురువారం ఆర్థిక సాయం అందజేశారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మురుగేషన్, సాయుధ దళంలో విధులు నిర్వహిస్తున్న రవితేజ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు IDRF ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎస్పీ చెక్కులను అందజేశారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
News October 30, 2025
తుఫాన్ను సీఎం అద్భుతంగా ఎదుర్కొన్నారు: MP

చిత్తూరు: మొంథా తుఫాన్ను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా ఎదుర్కొన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు. బాధితులకు సహాయం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు.
News October 30, 2025
చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.


