News March 7, 2025
తిరుపతి జిల్లాలో రేపు స్కూళ్లకు సెలవు

తిరుపతి జిల్లాలో రేపు(శనివారం) అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా టీచర్లు జరుపుకోవాలన్న ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 27, 2025
జమ్మికుంట: నిలకడగా పత్తి గరిష్ఠ ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి గరిష్ట ధర నిన్నటి లాగానే నిలకడగానే ఉంది. గురువారం యార్డుకు 462 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకొని రాగా.. గరిష్ఠంగా క్వింటాకు రూ.7,250, కనిష్ఠంగా రూ.6,250, అలాగే గోనెసంచుల్లో వచ్చిన 11 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ. 6,300 ధర లభించిందని మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ కార్యకలాపాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.
News November 27, 2025
జనగామ: మొదటి రోజు 108 నామినేషన్లు దాఖలు

జనగామ జిల్లాలో మొదటి విడతలో భాగంగా చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, రఘునాథ్పల్లి, జాఫర్గఢ్, లింగాల గణపురం 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. చిల్పూర్-17, స్టేషన్ ఘనపూర్-17, రఘునాథ్పల్లి-35, జాఫర్గఢ్-24, లింగాల గణపురం-15 సర్పంచ్ నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 108 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు.
News November 27, 2025
మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అల్లాదుర్గంలో 5, రేగోడులో 6, పెద్ద శంకరంపేటలో 7, టేక్మాల్లో 5, పాపన్నపేటలో 13, హవెలిఘనాపూర్లో 16 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే వాడు మెంబర్ స్థానాలకు టేక్మాల్ మండలంలో ఒకటి, హవేలిఘనపూర్లో మూడు నామినేషన్ దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం ఉంది.


