News January 30, 2025
తిరుపతి జిల్లా టీచర్లకు DEO గమనిక

తిరుపతి జిల్లాలోని HMలు, ఉపాధ్యాయులకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS) వివరాల నమోదుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు DEO KVN.కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎడిట్ ఆప్షన్ను 31వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. వచ్చే బదిలీలు, పదోన్నతులు ఎడిట్ ఆప్షన్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. సవరణ చేయకపోతే మరోసారి అవకాశం లేదన్నారు.
Similar News
News September 18, 2025
కొత్తగూడెం- భద్రాచలం మధ్య ఎయిర్పోర్టుకు స్థలాలు..?

కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మాణానికి చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో స్థలాలను గుర్తించినా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలిసిందే. ఈసారి భద్రాచలం- కొత్తగూడెం మధ్య ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే ఫీజుబులిటీ సర్వేకు ప్రభుత్వం ఇక్కడే స్థలాలను చూపించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రెండు, మూడుచోట్ల స్థలాలను గుర్తించగా, వాటిలోఒకటి ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<