News January 30, 2025
తిరుపతి జిల్లా టీచర్లకు DEO గమనిక

తిరుపతి జిల్లాలోని HMలు, ఉపాధ్యాయులకు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం(TIS) వివరాల నమోదుకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు DEO KVN.కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎడిట్ ఆప్షన్ను 31వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. వచ్చే బదిలీలు, పదోన్నతులు ఎడిట్ ఆప్షన్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. సవరణ చేయకపోతే మరోసారి అవకాశం లేదన్నారు.
Similar News
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
News December 1, 2025
అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తా: CM

అమరావతిని ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా మారుస్తున్నామని, మొదటి దశ పనులు 2028 నాటికి పూర్తవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఉంగుటూరు(M) నల్లమాడు సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 15-20 ఏళ్లు అధికారంలో ఉండాలని ఆకాంక్షించారు. గత పాలకుల ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఊసే లేదని విమర్శించారు.
News December 1, 2025
గద్వాల్: రూ.40.80లక్షలకు సర్పంచ్ పదవి ఏకగ్రీవం..!

రాజోలి(M) మాన్దొడ్డిలో సోమవారం సర్పంచ్ ఏకగ్రీవం సవాల్ పాట జరిగింది. ఈ ఏకగ్రీవం పోటీలో భీమన్న అనే వ్యక్తి రూ.40.80 లక్షలకు మాన్దొడ్డి సర్పంచ్ కుర్చీని దక్కించుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మాన్దొడ్డి జనరల్ ఉమెన్కి రిజర్వేషన్ కేటాయించారు. ఏకగ్రీవం వెనక బీజేపీ నాయకులు ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సర్పంచును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చట్టరీత్యా నేరమని అధికారులు చెబుతున్నారు.


