News March 19, 2025
తిరుపతి జిల్లా ప్రజలకు గమనిక

తిరుపతి కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే జరుగుతుంది. వచ్చే సోమవారం నుంచి గ్రీవెన్స్ డే సమయాన్ని మార్చారు. ఈనెల 24వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఈ విషయాన్ని తిరుపతి జిల్లా ప్రజలు గమనించాలని కలెక్టరేట్ అధికారులు కోరారు.
Similar News
News December 13, 2025
WGL: డబ్బులు అడిగిన విలేకరులను చితకబాదిన నేతలు!

వరంగల్ శివారులో రెండో విడత ప్రచారానికి కవరేజ్కు వెళ్లిన ఇద్దరు మీడియా కంట్రిబ్యూటర్లు ప్రచారం ముగిసిన అనంతరం మామూళ్లు అడిగినట్టు ఆరోపణలు వచ్చాయి. డబ్బుల విషయంలో వివాదం చెలరేగగా, ఆగ్రహించిన పార్టీ శ్రేణులు మీడియా ప్రతినిధుల ఫోన్లు లాక్కొని తరిమినట్లు సమాచారం. గ్రామశివారు వరకు వెంబడించి దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అనంతరం వారు పోలీస్ స్టేషన్కు చేరుకోగా ఓ MLA ఆదేశాలతో ఇరుపక్షాలు రాజీ పడ్డాయి.
News December 13, 2025
సంతబొమ్మాళి: రాకాసి అలలు..ప్రాణాలు తీశాయి

చేపల వేటకెళ్లిన మత్స్యకారుడు మృతి చెందిన ఘటన సంతబొమ్మాళి(M) భావనపాడులో శనివారం ఉదయం జరిగింది. తోటి జాలర్లతో వేటకెళ్లిన రాజయ్య(60) బలమైన కెరటాలకు తెప్ప నుంచి ప్రమాదవశాత్తూ సముద్రంలోకి పడిపోయాడు. పక్కనే ఉన్నవారు అప్రమత్తమై కాపాడేలోపే రాకాసి అలల తాకిడికి తనువు చాలించాడు. అనంతరం డెడ్ బాడీని ఒడ్డుకు తీసుకురాగా..సమాచారం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.


