News August 9, 2024
తిరుపతి: టీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలి: ఎంపీ

టీటీడీ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. సుమారు 50 మంది ఇంజనీరింగ్, ఇతర శాఖల ఉద్యోగులకు స్టేట్ విజిలెన్స్ విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. ఇది ఉద్యోగస్తులను బెదిరించడమేనని వెల్లడించారు. ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను అండగా ఉంటానని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, కూటమి నాయకులు వేధింపులు మానుకోకపోతే పార్లమెంటుకు దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
Similar News
News December 1, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు ఇలా..!

చిత్తూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు కురిసిన వర్షపాత వివరాలను అధికారులు వెల్లడించారు. సోమలలో అత్యధికంగా 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా గుడిపాలలో 2.4 మి.మీ పడింది. కార్వేటినగరంలో 19. 2, పులిచెర్లలో 15.8, విజయపురంలో 15.4, రొంపిచర్లలో 14.8, సదుంలో 13, వెదురుకుప్పంలో 10.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
News December 1, 2025
6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.
News December 1, 2025
చిత్తూరు జిల్లాలో తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు

చిత్తూరు జిల్లాలో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లాలో 2023-24లో 0.5 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024-25 నాటికి అదే శాతం ఉంది. 2025-26లో 0.36 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 47,454 మందిని పరీక్షించగా.. 168 మందికి పాజిటివ్గా తేలింది. అలాగే 22,430 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో 5మందికి హెచ్ఐవీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.


