News April 5, 2024

తిరుపతి: టీడీపీలో చేరిన వైసీపీ ZPTC

image

తిరుపతి జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పాకాల జడ్పీటీసీ నంగా పద్మజ, ఆమె భర్త బాబు రెడ్డి చెవిరెడ్డి తీరును నిరసిస్తూ నిన్న వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప.గో జిల్లా గోపాలపురంలో మాజీ సీఎం చంద్రబాబును కలిశారు. ఆయన సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం నంగా దంపతులు మాట్లాడుతూ.. కష్టపడిన వారికి వైసీపీలో గుర్తింపు లేదని.. ఆ పార్టీలో ఉత్సవ విగ్రహాలు లాగా ఉండలేక రాజీనామా చేశామని చెప్పారు.

Similar News

News January 24, 2025

చిత్తూరు: కొత్త దంపతులకు ఊహించని పెళ్లి కానుక 

image

స్నేహితులు, బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు బహుమతిగా విలువైన వస్తువులు ఇస్తుంటాం. కానీ చిత్తూరులో ఓ జంటకు అందిన బహుమతికి అందరూ ఆశ్చర్యపోయారు. నగరంలో జరిగిన ఓ పెళ్లికి ట్రాఫిక్ CI నిత్యబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన దంపతులకు బైకు హెల్మెట్‌ను బహూకరించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని, అప్పుడే మనతోపాటూ మనల్నే నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటారన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.  

News January 24, 2025

తిరుపతిలో అమానుష ఘటన

image

తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 

News January 24, 2025

తిరుపతి: ఫిబ్రవరి 3 నుంచి పరీక్షల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. డిగ్రీ తృతీయ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మూడో తేదీ, మొదటి సంవత్సరం పరీక్షలు 14వ తేదీ నుంచి ప్రారంభమం అవుతాయి. అభ్యర్థులు ఇతర వివరాలకు www.svudde.in వెబ్‌సైట్ చూడాలని సూచించారు.