News March 6, 2025
తిరుపతి: దొంగల ముఠా అరెస్ట్

ఎవరు లేని ఇళ్లను పగలు నిఘా పెట్టి రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. వారి నుంచి రూ.35 లక్షల విలువగల 501 గ్రా. బంగారం, 1,20,000 విలువగల 2116 గ్రాముల వెండి నగలు, ఒక కారు, ఒక ఆటో, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరిపై పలు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ చాటిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
Similar News
News November 6, 2025
ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.
News November 6, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ద్రోణి ప్రభావంతో రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 6, 2025
అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటిన అనంతరం ఆయన సిబ్బంది పరేడ్ను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్ బాక్స్లను స్వయంగా తనిఖీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. కిట్ ఆర్టికల్స్ నిర్వహణలో పరిశుభ్రత, శ్రద్ధ కనబరిచిన కానిస్టేబుల్ జితేందర్కు అభినందించి రివార్డును మంజూరు చేశారు.


