News January 26, 2025
తిరుపతి: నమ్మించి రూ.11 లక్షలు దోచేసిన పంతులమ్మ

తోటి టీచరే కదా అని నమ్మినందుకు ఓ పంతులమ్మ రూ.11లక్షలు కాజేసిన ఘటన తిరుపతిలో జరిగింది. బైరాగిపట్టెడకు చెందిన శిరీషమాధురి, రేణిగుంట రోడ్డులో ఉంటున్న సీమకుమారి ప్రైవేట్ పాఠశాలలో టీచర్లు. శిరీష స్థలం కొనుగోలు చేయాలని చూస్తుండగా సీమకుమారి తమ స్థలాన్ని కొనమని కోరింది. శిరీషకు స్థలం నచ్చడంతో నగదు ఇచ్చింది. అగ్రిమెంట్ సమయంలో డీకేటి పట్టా ఇవ్వడంతో మోసపోయానని గ్రహించిన శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News December 10, 2025
టేకులపల్లి: లారీని ఢీకొట్టి యువకుడికి తీవ్రగాయాలు

టేకులపల్లి మండలంలోని బోరింగ్ తండా నుంచి టేకులపల్లి వైపు వస్తున్న బైక్ బుధవారం లారీని ఢీ కొట్టడంతో వ్యక్తికి గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి బొగ్గు తరలిస్తున్న లారీని ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 10, 2025
WGL: కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి

వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నంబర్-1పై ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. శరీరం నడుము వద్ద తెగి రెండు ముక్కలైంది. మృతుడు తెలుపు, లేత నీలిరంగు చారల షర్ట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
News December 10, 2025
NTPCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

<


