News August 27, 2024
తిరుపతి: నిధులు వృధా చేయరాదు: మంత్రి నారాయణ

తుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో నిధుల వృధాను అరికట్టాలని మంత్రి నారాయణ సూచించారు. అభివృద్ధి పనులపై తుడా సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టనున్న పనులు, నిధుల పెండింగ్ తదితర అంశాలపై కమిషనర్ మౌర్య పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నిధుల కొరత ఉందని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరు చేసేందుకు సీఎం కృషి చేస్తున్నట్టు మంత్రి చెప్పారు.
Similar News
News October 29, 2025
చిత్తూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి చిత్తూరు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసు అధికారుల కథనం మేరకు.. పుంగనూరు మండలంలోని బాలికను 2019 ఏప్రిల్లో అత్యాచారం చేసిన కేసులో నేరం నిర్ధారణ కావడంతో కళ్యాణ్ అనే నిందితుడికి జడ్జి శంకర్రావు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు.
News October 29, 2025
కాణిపాకంలో పేలిన సిలిండర్

కాణిపాకం కాలనీ హౌసింగ్ విభాగంలో బుధవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనలో చిన్న పాపమ్మకు గాయాలు అయినట్లు సమాచారం. క్షతగాత్రురాలిని తక్షణమే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఇంటి గోడలు, పైకప్పు భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 28, 2025
చిత్తూరు జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు: DEO

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బుధవారం నుంచి యథావిధిగా పనిచేస్తాయని DEO వరలక్ష్మి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవు ప్రకటించడం జరిగిందని, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని ఆమె తెలిపారు.


