News October 31, 2024

తిరుపతి: నేడు విద్యుత్ బిల్లుల వసూలు

image

వినియోగదారుల కోసం గురువారం విద్యుత్తుశాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని తిరుపతి జిల్లా SE సురేంద్రనాయుడు  తెలిపారు. బిల్లులు సకాలంలో చెల్లించి అపరాధ రుసుము పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News October 15, 2025

గూగుల్ రాకపై చిత్తూరు MP ఏమన్నారంటే..?

image

విశాఖలో గూగుల్ ఏర్పాటుతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతమస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు అన్నారు. నూతన ఆవిష్కరణలో సీఎం చంద్రబాబు ముందుంటారని కొనియాడారు. వికసిత భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేస్తోందన్నారు. ఏపీ, గూగుల్ మధ్య ఒప్పందం చారిత్రాత్మకమని చెప్పారు. ఈ ఒప్పందంతో విశాఖపట్నం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందన్నారు.

News October 15, 2025

తిరుపతిలో వైసీపీ నాయకుల నిరసన

image

సోషియల్ మీడియాలో ప్రశ్నించారని వైసీపీ నాయకులను అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ ఖండించింది. తిరుపతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు కూటమి ప్రభుత్వానికి వత్తాసుగా నిలుస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు.

News October 15, 2025

CTR: రేపే LPG బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం

image

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్ర చెరువుపల్లి వద్ద LPG బాట్లింగ్ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధానితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు పాల్గొంటారు.