News February 19, 2025

తిరుపతి: న్యాయ సేవ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్

image

తిరుపతి జిల్లాలోని గూడూరు, కోట, వెంకటగిరి, S.పేట, N.పేటల్లో న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. ఇంటర్, ఆపైన చదివిన పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్‌వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News November 27, 2025

ప్రపంచంలోనే తొలిసారి.. సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్

image

అన్ని దేశాల్లో డెంగ్యూ కేసులు పెరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెజిల్ సైంటిస్టులు అద్భుతం చేశారు. ప్రపంచంలోనే తొలిసారి సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. Butantan-DV అనే ఈ టీకాను 12-59 ఏళ్ల ప్రజలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం డెంగ్యూకు TAK-003 వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. WHO నిబంధనల ప్రకారం 3 నెలల వ్యవధిలో రెండుసార్లు వేసుకోవాలి.

News November 27, 2025

TTD మాజీ AVSO కుటుంబానికి స్నేహితుల అండ

image

ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన TTD మాజీ AVSO వై.సతీశ్ కుమార్ కుటుంబానికి ఆయన స్నేహితులు(2012 బ్యాచ్‌మేట్స్) అండగా నిలిచారు. ఈనెల 15న పరకామణి కేసు విచారణకు వెళ్తూ సతీష్ రైలు పట్టాలపై శవంగా కనిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన కర్మక్రియలకు హాజరైన AP, తెలంగాణలకు చెందిన బ్యాచ్‌మేట్స్ సతీష్ తల్లి పేరిట రూ.3 లక్షలు, పిల్లల పేరిట రూ.11 లక్షల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

News November 27, 2025

పంచాయతీ ఎన్నికలు.. పాలమూరులో ఉత్కంఠ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కోర్టు నేడు విచారించనుంది.