News February 19, 2025
తిరుపతి: న్యాయ సేవ సహాయకుల పోస్టులకు నోటిఫికేషన్

తిరుపతి జిల్లాలోని గూడూరు, కోట, వెంకటగిరి, S.పేట, N.పేటల్లో న్యాయ సేవ అధికార కమిటీల పారా లీగల్ సహాయకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గీత తెలిపారు. 25 లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా కోర్టుకు అందించాలన్నారు. ఇంటర్, ఆపైన చదివిన పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీ సేవకులు, లా విద్యార్థులు దరఖస్తు చేసుకోవచ్చన్నారు.
Similar News
News March 17, 2025
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్ను ప్రయోగిస్తామని చెప్పారు.
News March 17, 2025
నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.
News March 17, 2025
నంద్యాల: ALERT.. మధ్యాహ్నం 12:30 వరకే

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నేడు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లకు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.