News March 4, 2025
తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

తిరుపతి రూరల్ మండలంలోని విజయనగర్ కాలనీ డాక్టర్ ఆర్.సి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలిపింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10, ఇంటర్, డిగ్రీలలో ఉత్తీర్ణులైన యువతి యువకులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Similar News
News November 23, 2025
పెదవులు నల్లగా మారాయా?

రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి, స్మోకింగ్ వంటి వాటివల్ల పెదాలు నలుపు రంగులోకి మారుతుంటాయి. హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా కూడా కొన్నిసార్లు కారణమవుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరినూనె, తేనె, చక్కెర కలిపి పెదాలకు ప్యాక్ వేసి స్కబ్ చేయాలి. అలాగే పాలు, పసుపు ప్యాక్ వేయడం వల్ల కూడా పెదాల రంగు మారుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్, నెయ్యి, స్ట్రాబెర్రీ వంటివి పెదాలకు అప్లై చేసినా ఫలితం ఉంటుంది.
News November 23, 2025
కొత్తగూడెం: పశువుల అక్రమ రవాణా గుట్టు రట్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టపగలే పశువుల అక్రమ తరలింపు బహిర్గతమైంది. మణుగూరు నుంచి కొత్తగూడెం ప్రాంతానికి టాటా ఏసీ వాహనంలో 10కి పైగా ఆవులను ఇరుకుగా ఎక్కించి రవాణా చేస్తుండగా, లోడు ఎక్కువై అంబేడ్కర్ సెంటర్ వద్ద వాహనం ఆగిపోయింది. దీంతో అక్రమ రవాణా గుట్టు రట్టయింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే వాహనాన్ని సీజ్ చేసి, వివరాలు సేకరిస్తున్నారు.
News November 23, 2025
టీడీపీ నేపథ్యం ఉన్నా.. మేడిపల్లికి కీలక పదవి!

KNR జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా చొప్పదండి MLA మేడిపల్లి సత్యంను అధిష్ఠానం ప్రకటించింది. ఆయన గతంలో TDP నుంచి కాంగ్రెస్లోకి వచ్చి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో MLAగా విజయం సాధించారు. పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, సత్యంకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ద్వారా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే సంకేతాన్ని ఏఐసీసీ ఇచ్చింది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.


