News March 4, 2025
తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

తిరుపతి రూరల్ మండలంలోని విజయనగర్ కాలనీ డాక్టర్ ఆర్.సి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలిపింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10, ఇంటర్, డిగ్రీలలో ఉత్తీర్ణులైన యువతి యువకులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
Similar News
News November 19, 2025
నవంబర్ 19: చరిత్రలో ఈ రోజు

*1828: స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జననం
*1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
*1960: సినీ నటుడు శుభలేఖ సుధాకర్ జననం
*1975: మాజీ విశ్వ సుందరి, నటి సుస్మితా సేన్ జననం
*అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
*ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
News November 19, 2025
KNR: స్థానిక సమరం షురు.. వచ్చే నెలలో ఎన్నికలకు క్యాబినెట్ పచ్చజెండా

బీసీ రిజర్వేషన్లపై ప్రతిష్ఠంభన సోమవారంతో వీడగా, ఇక పల్లెల్లో స్థానిక సమరం షురూ కానుంది. డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సోమవారం జరిగిన క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేవలం పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడానికి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,216 గ్రామ పంచాయతీలు, 60 జడ్పీటీసీ, 646 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.
News November 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 19, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.08 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


