News March 4, 2025

తిరుపతి: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

image

తిరుపతి రూరల్ మండలంలోని విజయనగర్ కాలనీ డాక్టర్ ఆర్.సి రెడ్డి డిగ్రీ కళాశాలలో ఈనెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ తెలిపింది. గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. 10, ఇంటర్, డిగ్రీలలో ఉత్తీర్ణులైన యువతి యువకులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Similar News

News March 16, 2026

రాయికోడ్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

రాయికోడ్ మండలం మహ్మదాపూర్ – నల్లంపల్లి రహదారిపై సోమవారం జరిగిన ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల లేదా బైక్ స్కిడ్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2026

FLASH: ఏసీబీ వలలో కరీంనగర్ సూపరింటెండెంట్

image

ఫైళ్లలో తప్పులను సరిదిద్దేందుకు లంచం డిమాండ్ చేసిన కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయ సూపరింటెండెంట్ ఇగాల మధుసూదన్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. బినామీ ఖాతా ద్వారా సుమారు ₹14.77 లక్షల మేర యూపీఐ లావాదేవీల రూపంలో లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది.

News March 16, 2026

ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టికలు తప్పనిసరి: VZM DMHO

image

జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్స్, స్కాన్ సెంటర్లు తమ సేవల ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని DMHO ఎస్. జీవన్ రాణి సోమవారం ఆదేశించారు. స్కాన్ సెంటర్లు పీసీపీఎన్‌డీటీ చట్టం నిబంధనలు పాటిస్తూ లింగ నిర్ధారణ నేరమని తెలుపుతూ బోర్డులు ప్రదర్శించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.