News March 25, 2025

తిరుపతి: పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

image

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులు భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ నరసింహులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో పరీక్షలు నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 2,080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News October 25, 2025

అన్ని రాష్ట్రాలకు ‘హైడ్రా’ అవసరం: పవన్

image

హైడ్రా లాంటి వ్య‌వ‌స్థ APతో పాటు అన్ని రాష్ట్రాల‌కు అవ‌స‌ర‌మ‌ని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. పాల‌కుల ముందుచూపు, నిబ‌ద్ధ‌తగ‌ల అధికారుల ప‌నితీరు ఏ వ్య‌వ‌స్థ‌కైనా మంచి పేరు తీసుకువస్తుందన్నారు. దేశంలోనే మొట్ట‌మొద‌టిగా హైడ్రా రూపంలో స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను TG ప్ర‌భుత్వం తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. ఇవాళ మంగళగిరి క్యాంప్ ఆఫీస్‌లో పవన్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

News October 25, 2025

పెద్దపల్లిలో స్కానింగ్‌ సెంటర్లను తనిఖీ చేసిన DM&HO

image

పెద్దపల్లిలోని స్కానింగ్‌ సెంటర్లను DM&HO డాక్టర్‌ వాణిశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్‌ ప్రసాద్‌ మెమోరియల్‌, లీలావతి నర్సింగ్‌ హోమ్‌, శ్రీదేవీ ఆసుపత్రి, రమా ఆసుపత్రిలో స్కానింగ్‌ యంత్రాలను పరిశీలించారు. రిజిస్టర్డ్‌ గైనకాలజిస్ట్‌ ఏ స్కాన్‌లు చేస్తున్నారా, గర్భిణులకు స్కాన్‌ చేసిన వివరాల రికార్డ్స్‌ పరిశీలించారు. ఫారం ఎఫ్‌ సరిగా నమోదు చేస్తున్నారా లేదా ఆరా తీశారు.

News October 25, 2025

US, EU ఆంక్షలను పాటిస్తాం: రిలయన్స్

image

రష్యా చమురు కంపెనీలపై అమెరికా, ఈయూ ఆంక్షలను పాటిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. వాటి మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని, ఆంక్షల ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాస్‌నెఫ్ట్, లాకాయిల్‌పై అమెరికా, ఈయూ ఆంక్షలు విధించాయి. ఆ రెండు సంస్థలతో వ్యాపారాన్ని నవంబర్ 21 నాటికి ముగించాలని రిఫైనరీలను ఆదేశించాయి.