News April 11, 2025

తిరుపతి ప్రజలకు గమనిక 

image

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఇంటి పన్నులు, ఖాళీ జాగా పన్నులను చెల్లిస్తే 50 శాతం వడ్డీ మినహాయింపు ఈ నెలాఖరు వరకు పొడిగించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య శుక్రవారం తెలిపారు. 2024-25 సంవత్సరంలో పెండింగ్ ఉన్న బకాయిలు ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకేసారి చెల్లిస్తే  ప్రస్తుతమున్న వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని బకాయిదారులు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News November 28, 2025

HYDలో పెరుగుతున్న కేసులు.. మీ పిల్లలు జాగ్రత్త !

image

హైదరాబాద్‌లో పిల్లలకు చర్మ సంబంధిత(స్కిన్) అలర్జీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చల్లని వాతావరణం, పెరిగిన కాలుష్యం, ధూళి దీనికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. ఉప్పల్, నాచారం, హబ్సిగూడలోని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీల్లో జలుబు, అలర్జీ, జ్వరం లాంటి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చల్లగాలి తగలకుండా చూడాలని, బయట నుంచి వచ్చిన వెంటనే పిల్లలను ఎత్తుకోవద్దని వైద్య నిపుణులు తల్లిదండ్రులను హెచ్చరించారు.

News November 28, 2025

మరోసారి మెగా పీటీఎం

image

AP: మరోసారి మెగా పేరెంట్-టీచర్స్ మీట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. DEC 5న జూనియర్ కాలేజీలతో పాటు 45వేల ప్రభుత్వ బడుల్లో ఈ ప్రోగ్రాం జరగనుంది. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను చూపించి తల్లిదండ్రులతో క్లాస్ టీచర్ మాట్లాడనున్నారు. మంత్రి లోకేశ్ మన్యం జిల్లాలో నిర్వహించే మెగా పీటీఎం‌లో పాల్గొంటారు. గతేడాది మొదటిసారి, ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలో రెండోది, వచ్చే నెల మూడో మెగా పీటీఎం జరగనుంది.

News November 28, 2025

నంద్యాల: చనిపోయినా.. మరొకరికి ‘వెలుగిచ్చాడు’

image

నందికొట్కూరుకు చెందిన సురేంద్రబాబు(ప్రమోద్) బుధవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుమారుడి నేత్రాల ద్వారా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించాలనుకున్న తల్లిదండ్రులు కళ్లు దానం చేసేందుకు అంగీకరించారు. నేత్రాలను ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వైద్యులకు అందించినట్లు వారు తెలిపారు.