News February 23, 2025

తిరుపతి: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు

image

ఎపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్ ఎస్ తెలిపారు. ఆదివారం ఉదయం10 నుంచి 12.30 గంటల వరకు మధ్యాహ్నం 3.00 నుంచి 5:30 గంటల వరకు రెండు సెషన్లలో ఎపీపీస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహణ జరిగిందన్నారు. ఈ పరీక్షల్లో 5055 మంది పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ఎందుకు 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 21, 2025

మహబూబ్‌నగర్: మొదటి పరీక్షకు 41 మంది గైర్హాజరు 

image

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. నేటి పరీక్షకు 12,785 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 12,744 మంది విద్యార్థులు హాజరయ్యారు. 41 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇక మొత్తంగా 99.98 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల సందర్భంగా నేడు ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

News March 21, 2025

MBNR: పదోతరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ

image

పదో తరగతి పరీక్షలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహత్మా గాంధీ రోడ్, క్రీస్తు జ్యోతి విద్యాలయం, భూత్పూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణ తీరును ఆమె ఈరోజు పరిశీలించారు. మౌలిక సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News March 21, 2025

విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్

image

కర్ణాటక ప్రభుత్వం విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చేయనుంది. 8 నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టనుంది. కౌమారదశలో శారీరక, భావోద్వేగ, హార్మోన్ల మార్పుల గురించి వారికి అవసరమైన నాలెడ్జ్‌ను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వైద్య నిపుణులు వారానికి రెండు సార్లు తరగతులు నిర్వహిస్తారు. అలాగే, చిన్న వయసులో లైంగిక కార్యకలాపాల వల్ల దుష్ప్రభావంపై కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

error: Content is protected !!