News March 21, 2025

తిరుపతి: ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదు

image

తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం లేదని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు డీఈవో కేవీఎన్ కుమార్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఒంటిపూట బడులు పెట్టని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్, ప్రేమ్ కుమార్, లోకేశ్, యుగంధర్, ముని, సుకుమార్ పాల్గొన్నారు.

Similar News

News October 27, 2025

NTR జిల్లా తుఫాన్ కంట్రోల్ రూమ్ నంబర్‌లు

image

కలెక్టర్ కార్యాలయం: 9154970454
విజయవాడ RDO కార్యాలయం: 08662574454
నందిగామ RDO కార్యాలయం: 7893053534
తిరువూరు RDO కార్యాలయం: 8309836215, 08673251235
ఏ.కొండూరు: 9949063837
గంపలగూడెం: 7981131013
తిరువూరు: 8096587174
రెడ్డిగూడెం: 9182679512
విస్సన్నపేట: 9703983505
VJA సెంట్రల్: 9849903993
VJA పశ్చిమ: 9121284800
VJA ఉత్తరం: 9849903979

News October 27, 2025

మంచిర్యాల: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

మనస్తాపం చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలంలో జరిగింది. SI తహిసీనోద్దీన్ ప్రకారం.. గుడిరేవుకు చెందిన అన్వేష్(22) డిగ్రీ చదువుతున్నాడు. ఫ్రెండ్స్‌తో టూర్‌కి వెళ్లడానికి తండ్రిని డబ్బులు అడగగా లేవని మందలించాడు. మనస్తాపం చెందిన అన్వేష్ ఈనెల 11న పురుగుమందు తాగి స్టేటస్ పెట్టాడు. ఇది చూసిన స్నేహితులు తండ్రికి సమాచారం అందించగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

News October 27, 2025

మెుంథా తుఫాన్ ఇంకా ఎంత దూరం ఉందంటే.!

image

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుందని APSDMA తెలిపింది. ఇది చెన్నైకి 640 కి.మీ, విశాఖపట్నానికి 740 కి.మీ, కాకినాడకు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. నేడు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.