News March 21, 2025
తిరుపతి: ప్రైవేట్ స్కూళ్లపై ఫిర్యాదు

తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం లేదని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు డీఈవో కేవీఎన్ కుమార్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఒంటిపూట బడులు పెట్టని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమాద్రి యాదవ్, ప్రేమ్ కుమార్, లోకేశ్, యుగంధర్, ముని, సుకుమార్ పాల్గొన్నారు.
Similar News
News April 20, 2025
కొల్లిపర: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

కొల్లిపర మండలం గుడిబండి వారిపాలెంకి చెందిన గుంటూరు రత్న కుమారి (22) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొల్లిపరలోని గవర్నమెంట్ హాస్పటల్కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ సుప్రియ నిర్ధారించారు. తెనాలి సీఐ ఆర్.ఉమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
కొత్త ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్!

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంట్ అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కంపెనీలతో ఒప్పందం కుదిరిన తర్వాత మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకే లబ్ధిదారులకు సిమెంట్ అందజేయాలని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.
News April 20, 2025
కరీంనగర్: JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సత్తా

JEE మెయిన్స్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు M.రోహిత్ 17, T.కుందన్ 814, P.ఈశ్వర్ ముఖేష్ 1275, M. అంజలి 2575, B. అక్షర 2992, M. తరుణ్ 5949, G. నందిని 7464 ర్యాంకులు సాధించారు. 20వేల లోపు 15 మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించగా.. పరీక్షకు హాజరైనవారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్డ్కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులను చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు.