News February 7, 2025
తిరుపతి: బీటెక్ ఫలితాల విడుదల

తిరుపతి శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో గతేడాది డిసెంబర్లో బీటెక్ CSE, EEE, ECE, MEC చివరి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు యూనివర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఫలితాలను www.spmvv.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
Similar News
News September 19, 2025
చిత్తూరు: టమాటా ప్రాసెసింగ్ యూనిట్ కలేనా..?

చిత్తూరు జిల్లా టమాటా పంటకు పెట్టింది పేరు. ఆసియాలోనే అతి పెద్ద టమాటా మార్కెట్గా పేరు గడించింది. రోజుకు 1,500 టన్నుల పంటకు ఇక్కడ వేలం నిర్వహించే అవకాశం ఉంది. ఇంత ఉన్నా రైతులు మాత్రం నష్టాలతో పంటను సాగు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పాలకులు టమాటో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నా కార్యరూపం మాత్రం దాల్చ లేదు. ఇప్పటికైనా పాలకులు దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
News September 19, 2025
KNR: మంచి ఫలితాలిస్తున్న FRS.. పెరిగిన అటెండెన్స్..!

విద్యార్థులు, టీచర్ల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం తెచ్చిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం(FRS) మంచి ఫలితాలనిస్తోంది. దీంతో హాజరుశాతం భారీగా పెరుగుతోంది. 2024 AUG నుంచి దీనిని అమలు చేస్తుండగా JGTLలో 15%, SRCLలో 12%, KNRలో 9%, PDPLలో 2% మేర అటెండెన్స్ పెరిగింది. కాగా, PDPL, KNR టీచర్లు ఈ సిస్టంను లైట్ తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. స్టూడెంట్స్, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తే నాణ్యమైన విద్యకు ఢోకా ఉండదు.
News September 19, 2025
అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు: అమీషా

పెళ్లి తర్వాత వర్క్ చేయొద్దని కండిషన్స్ పెడుతుండటం వల్లే తాను ఇప్పటిదాకా వివాహం చేసుకోలేదని నటి అమీషా పటేల్ వెల్లడించారు. ’50 ఏళ్ల వయసులోనూ నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి. నా ఏజ్లో సగం వయసున్న వారూ డేట్కి రమ్మని అడుగుతుంటారు. సినిమాల్లోకి రాకముందు సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నా. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లొద్దనడంతో వదులుకున్నా. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధమే’ అని ఓ పాడ్కాస్ట్లో పేర్కొన్నారు.