News September 3, 2024

తిరుపతి: భర్త దారుణ హత్య.. భార్యకు జీవితఖైదు

image

కట్టుకున్న భర్తను హత్య చేసిన కేసులో రేణిగుంట బుగ్గ వీధిలో ఉంటున్న ఎస్.వసుంధరకు జీవిత ఖైదును విధిస్తూ తిరుపతి 4వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అర్చన తీర్పు చెప్పారు. తనతో పాటు కుమారుడిని నిర్లక్ష్యం చేయడంతో ఆమె 2022 జనవరి 20న భర్త తలను నరికి మొండెంను వేరు చేసి తలను ఓ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకుని రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో స్వయంగా లొంగిపోయింది. కేసు నిరూపణ కావడంతో శిక్ష ఖరారు అయింది.

Similar News

News October 23, 2025

మేయర్ దంపతుల హత్య కేసులో రేపు తీర్పు

image

రాష్ట్రంలో సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్యపై రేపు కోర్టు తీర్పు ఇవ్వనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ దంపతులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో 21 మంది నిందితులు 122 మంది సాక్షుల విచారణ కోర్టు పూర్తి చేసింది. 10 సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు ఇవ్వనుంది. కోర్టు వద్ద 144 సెక్షన్ విధించారు. పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.

News October 23, 2025

చిత్తూరు జిల్లాలో వర్షాలు.. ఇవి గుర్తుంచుకోండి

image

➤ నేటి నుంచి 3రోజులు భారీ వర్షాలు
➤ అత్యవసరమైతే ఇళ్ల నుంచి బయటకు రండి
➤ బీచ్‌లకు వెళ్లడం, చేపలవేట నిషేధం
➤ వర్షాల సమయంలో టీవీలు, ఫ్రిడ్జ్‌లు ఆపేయండి
➤వాగులు, కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకండి
➤కలెక్టరేట్ నంబర్: 9491077325, 08572242777

News October 22, 2025

బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని 12 మేకల మృతి

image

బంగారుపాళ్యం మండలం గుండ్ల కట్టమంచి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. యజమాని వివరాలు మేరకు.. బెంగళూర్- చెన్నై జాతీయ రహదారిపై మేకల రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని కంటైనర్ ఢీకొనడంతో 12 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.