News February 2, 2025

తిరుపతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

image

తిరుపతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార, విపక్షాలు పోటాపోటీగా కాలు దువ్వుతున్నాయి. వైసీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించగా.. ఆయన TDPలోకి మారుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన YCP మరో కార్పొరేటర్ భాస్కర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది.

Similar News

News November 24, 2025

SRPT: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

image

సూర్యాపేట జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్‌లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు కోరుతున్నారు.

News November 24, 2025

విశాఖ: మరింత సులువుగా ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు!

image

ట్రాఫిక్ చలాన్లను సులువుగా చెల్లించేందుకు విశాఖ పోలీసులు కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో mPARIVAHAN appలో చలాన్లు చెల్లించేవారు. ప్రస్తుతం PhonePay యాప్‌లోనూ eChallan & icon enable చేశారు. యాప్‌లో eChallan ఐకాన్ సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసి.. వాహన నెంబర్‌ను ఎంటర్ చేస్తే వాహనంపై ఉన్న చలానాలన్నీ కనిపిస్తాయి. అక్కడ చెల్లింపులు పూర్తి చేయొచ్చు.

News November 24, 2025

వరంగల్: నిత్య పెళ్లికూతురుపై కేసు నమోదు..!

image

నిత్య పెళ్లికూతురుపై <<18370111>>కేసు నమోదు<<>> చేసినట్లు వరంగల్(D) పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు. చౌటపల్లికి చెందిన దేవేందర్ రావు పెళ్లి కోసం మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న కోడిపల్లి అరుణ-రామారావులను సంప్రదించారు. దీంతో వారు నిమిషకవి ఇందిర అనే మహిళను చూపించగా వివాహం చేసుకున్నారు. అనంతరం ఆమెకు ఇంతకుముందే వివాహమై కూతురు ఉన్నవిషయం తెలుసుకొని ఫిర్యాదు చేయడంతో ఇందిర, తల్లి లక్ష్మి, అరుణ, రామారావుపై కేసు నమోదు చేశారు.