News February 2, 2025
తిరుపతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు

తిరుపతి రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార, విపక్షాలు పోటాపోటీగా కాలు దువ్వుతున్నాయి. వైసీపీ తరఫున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ప్రకటించగా.. ఆయన TDPలోకి మారుతున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన YCP మరో కార్పొరేటర్ భాస్కర్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కూటమి తమ అభ్యర్థిగా ప్రకటించాల్సి ఉంది.
Similar News
News October 24, 2025
మహిళల్లో షుగర్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

మహిళల్లో మధుమేహం వచ్చేముందు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు మధుమేహం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. దీని కారణంగా పీరియడ్స్ గతి తప్పుతాయి. చర్మం ఎర్రగా మారి దురద రావడం, జననేంద్రియాలు పొడిబారడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని చేతులు, కాళ్ళు జలదరిచడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News October 24, 2025
బొమ్మల కొలువులో సచివాలయం, బిర్లా మందిర్

దీపావళి సందర్భంగా లక్ష్మీదేవి కొలువుదీరేలా బొమ్మల కొలువు రూపొందించి అందులో తెలంగాణ సచివాలయ భవనం, బిర్లా మందిర్ నమూనాలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో నివసించే విజయ్ కుమార్ ఏటా ఇలా వినూత్నంగా కొత్త డిజైన్లతో బొమ్మలతో రూపొందిస్తుంటారు. అత్యంత ఆకర్షణంగా ఉన్న ఈ బొమ్మలను చూడటానికి వచ్చిన ప్రజలు విజయకుమార్ కళను అభినందిస్తున్నారు.
News October 24, 2025
చైనా కుతంత్రం.. సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్

భారత సరిహద్దుల్లో చైనా భారీ నిర్మాణాలు చేపడుతోంది. టిబెట్లోని పాంగాంగ్ లేక్ వద్ద ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ పనులు సాగుతున్నాయని India Today తెలిపింది. కమాండ్, కంట్రోల్ బిల్డింగ్స్, బారక్స్, వెహికల్స్ షెడ్స్ కడుతున్నట్లు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. అక్కడ క్షిపణులను మోసుకెళ్లే, ప్రయోగించే TEL వాహనాలు ఉన్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. HQ-9 మిసైల్ వ్యవస్థలను దాచే అవకాశం ఉందంటున్నారు.


