News January 17, 2025
తిరుపతి రుయాలో కడప జిల్లా మహిళ మోసం

కడప జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి ఐదేళ్ల కిందట తిరుపతి రుయాలో ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేసి ఆగిపోయింది. తాజాగా సంక్రాంతి రోజు కోటు వేసుకుని రుయాకు వెళ్లింది. ఓ రోగిని స్కానింగ్ రూములోకి తీసుకెళ్లి ఒంటిపై బంగారం ఉండకూదని చెప్పింది. గాజులు, చైన్లు తీసుకుంది. తర్వాత బయటకు వచ్చి రోగి బంధువుకు బంగారం ఇచ్చి.. ఓ చైన్ మాయం చేసింది. సెక్యూరిటీ సిబ్బంది శ్రీవాణి కోటులో చైన్ గుర్తించడంతో కేసు నమోదైంది.
Similar News
News November 22, 2025
కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.
News November 21, 2025
కడప కలెక్టరేట్లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

కడప కలెక్టరేట్లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
News November 21, 2025
కడప కలెక్టరేట్లో విశ్వవిద్యాలయాలపై సమీక్ష.!

కడప కలెక్టరేట్లో శుక్రవారం ఛైర్మన్ కూన రవి కుమార్ అధ్యక్షతన యోగివేమన యూనివర్సిటీ, ఇడుపులపాయ IIIT, హార్టికల్చర్ యూనివర్సిటీ, విశ్వవిద్యాలయాల పనితీరుపై పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ (PUC) సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు రామగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. యూనివర్సిటీల పనితీరు మరింత మెరుగుపడేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.


