News January 17, 2025
తిరుపతి రుయాలో కడప జిల్లా మహిళ మోసం

కడప జిల్లా వల్లూరుకు చెందిన శ్రీవాణి ఐదేళ్ల కిందట తిరుపతి రుయాలో ల్యాబ్ టెక్నిషియన్గా పనిచేసి ఆగిపోయింది. తాజాగా సంక్రాంతి రోజు కోటు వేసుకుని రుయాకు వెళ్లింది. ఓ రోగిని స్కానింగ్ రూములోకి తీసుకెళ్లి ఒంటిపై బంగారం ఉండకూదని చెప్పింది. గాజులు, చైన్లు తీసుకుంది. తర్వాత బయటకు వచ్చి రోగి బంధువుకు బంగారం ఇచ్చి.. ఓ చైన్ మాయం చేసింది. సెక్యూరిటీ సిబ్బంది శ్రీవాణి కోటులో చైన్ గుర్తించడంతో కేసు నమోదైంది.
Similar News
News February 9, 2025
కడపలో పాఠశాల విద్యార్థి ఆత్మహత్య

కడప నగర శివారులోని చింతకొమ్మదిన్నె మండల పరిధిలో గల నారాయణ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మదన్ మోహన్ రెడ్డి అనే విద్యార్థి ఈరోజు మధ్యాహ్నం హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది రిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు కొప్పర్తి గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
News February 9, 2025
కడప: 36 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు

కడప జిల్లా సిద్దవటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1987 – 88 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక జరిగింది. అప్పటి ఉపాధ్యాయులను వారు శాలువులతో ఘనంగా సత్కరించారు. గతంలో పాఠశాలలో తాము గడిపిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. అందరము కలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఇలా మీ బ్యాచ్తో మీరు కలిశారా?.
News February 9, 2025
కడప జిల్లా ప్రజలు జాగ్రత్త..!

కడప జిల్లాలో వాతావరణం మారుతోంది. వారంక్రితం వరకు జిల్లాను చలి వణికించింది. తాజాగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి తొలివారం మే నెలను తలపించేలా ఎండ కాస్తోంది. ఉదయం 10గంటల నుంచే సూర్యూడు నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న కడప జిల్లాలో గరిష్ఠంగా 34.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తలు పాటించాలని, తగిన మోతాదులో నీరు, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.