News February 4, 2025
తిరుపతి: రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకి ప్రాక్టీకల్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్ 24,927 మందికి 124 కేంద్రాలు, ఓకేషనల్ 2,355 మందికి 23 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్షలు వివిధ సెషన్స్గా పరీక్షలు ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని వివరించారు.
Similar News
News February 4, 2025
Stock Markets పరుగులు: ఇన్వెస్టర్లకు రూ.7లక్షల కోట్ల ప్రాఫిట్
బెంచ్మార్క్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 23,739 (+378), సెన్సెక్స్ 78,538 (+1397) వద్ద క్లోజయ్యాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఫార్మా, హెల్త్కేర్, O&G షేర్లు దుమ్మురేపాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్టీ, బీఈఎల్, ఇండస్ఇండ్ బ్యాంకు, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్స్. ట్రెంట్, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా, హీరోమోటో, నెస్లే ఇండియా టాప్ లూజర్స్. నేడు ఇన్వెస్టర్లు రూ.7లక్షల కోట్లు ఆర్జించారు.
News February 4, 2025
ఆర్మీ చీఫ్ మాటల్ని RG వక్రీకరించారు: రాజ్నాథ్
దేశ భద్రతపై రాహుల్గాంధీవి బాధ్యతా రాహిత్య రాజకీయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ మండిపడ్డారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులపై ఆర్మీ చీఫ్ చెప్పని మాటలను చెప్పినట్టుగా ఆయన వక్రీకరించారని విమర్శించారు. గస్తీ అంశంలో వివాదం తలెత్తినట్టు మాత్రమే చెప్పారన్నారు. 1962లో చైనా 38k sqkm ఆక్రమించిందని, 1963లో 5k sqkmను పాక్ ఆక్రమించి చైనాకు ఇచ్చిందన్నారు. రాహుల్ చరిత్ర తెలుసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
News February 4, 2025
అందోల్: క్యాన్సర్ నియంత్రణపై దృష్టి: మంత్రి
క్యాన్సర్ వ్యాధి నియంత్రణపై పూర్తిస్థాయి దృష్టి సారించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ పై అవగాహన పెంపొందించడానికి, నివారణ, గుర్తింపును ప్రారంభదశలో చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతియేటా ఫిబ్రవరి 4వ తేదీని పురస్కరించకుని ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు.