News April 24, 2024

తిరుపతి: రైతు కూలి కుమార్తెకు 597 మార్కులు

image

కలకడ మండలం గరడప్పగారిప్లలెలోని ఏపీ గురుకుల(బాలికలు) పాఠశాల విద్యార్థిని పి.లిఖిత 597 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సుమిత్ర తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తవేపకుప్ప గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలి ఇంటి జన్మించిన పి.లిఖిత రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడంతో పలువురు అభినందించారు.

Similar News

News October 22, 2025

బంగారుపాళ్యం: కంటైనర్ ఢీకొని 12 మేకల మృతి

image

బంగారుపాళ్యం మండలం గుండ్ల కట్టమంచి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని 12 మేకలు మృతి చెందాయి. యజమాని వివరాలు మేరకు.. బెంగళూర్- చెన్నై జాతీయ రహదారిపై మేకల రోడ్డు దాటే సమయంలో గుర్తు తెలియని కంటైనర్ ఢీకొనడంతో 12 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని తెలిపారు. బంగారుపాళ్యం సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

News October 22, 2025

చిత్తూరు జిల్లాలో రేపు కూడా పాఠశాలలకు సెలవు

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని పాఠశాలలకు గురువారం కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్టు డీఈఓ వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలను పాటించాలని కోరారు.

News October 22, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాస్థాయి అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి, ప్రమాదకర చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు.