News August 9, 2024

తిరుపతి రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు

image

గుంటూరు నుంచి గిద్దలూరు మీదుగా తిరుపతి వెళ్లే 17261/17262 ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9-21వ తేదీ వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనంగా రెండు జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.

Similar News

News November 26, 2025

దశాబ్దాల డ్రీమ్.. ఫైనల్‌గా మార్కాపురం డిస్ట్రిక్ట్!

image

మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామన్న హామీని CM చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. 1970లో ఒంగోలు జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. సీఎం నిర్ణయంతో దశాబ్దాల కల తీరడంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 21 మండలాలతో రాష్ట్రంలో 28వ జిల్లాగా మార్కాపురాన్ని ఏర్పాట్లు చేస్తూ త్వరలో గెజిట్ విడుదలకానుంది.

News November 26, 2025

మార్కాపురం జిల్లా.. ఈ ప్రత్యేకతలు తెలుసా?

image

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడగా జిల్లా బలాలపై సరికొత్త చర్చ సాగుతోంది. జలప్రసాదిని వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తైతే జిల్లా మరింత సస్యశ్యామలం కానుంది. కొత్త జిల్లా ఏర్పడిన కొన్ని నెలల్లోనే వెలుగొండ జలాలు అందించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అలాగే ఆసియాలోనే అతిపెద్ద రెండవ చెరువైన కంభం చెరువు, నల్లమల అందాలు కొత్త జిల్లాకు బలమే కాక, సరికొత్త అందాలుగా కూడా చెప్పవచ్చు.

News November 26, 2025

మార్కాపురం జిల్లా.. ఈ ప్రత్యేకతలు తెలుసా?

image

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ పడగా జిల్లా బలాలపై సరికొత్త చర్చ సాగుతోంది. జలప్రసాదిని వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తైతే జిల్లా మరింత సస్యశ్యామలం కానుంది. కొత్త జిల్లా ఏర్పడిన కొన్ని నెలల్లోనే వెలుగొండ జలాలు అందించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. అలాగే ఆసియాలోనే అతిపెద్ద రెండవ చెరువైన కంభం చెరువు, నల్లమల అందాలు కొత్త జిల్లాకు బలమే కాక, సరికొత్త అందాలుగా కూడా చెప్పవచ్చు.