News April 22, 2024
తిరుపతి: రోడ్డు ప్రమాదంలో 10th క్లాస్ విద్యార్థి మృతి

పట్టణంలోని కొర్లగుంటకు చెందిన మురుగేశ్ కుమారుడు చరణ్ (15) ఇటీవలే పది పరీక్షలు రాశాడు. ఇంటి నుంచి స్కూటీ తీసుకుని బయటకు వచ్చాడు. సుబ్బారెడ్డి నగర్ వద్దనున్న శ్రీనివాస సేతుపై వందడుగుల దూరం వెళ్లగానే అదుపుతప్పి డివైడర్ను వేగంగా ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడే పడిపోయాడు. స్థానికులు గుర్తించి 108 లో రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News April 24, 2025
చిత్తూరు: ఒకేసారి తండ్రి, కుమార్తె పాస్

చిత్తూరు జిల్లా రొంపిచర్ల పంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కుమార్తె ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యారు. 1995-96లో 10వ తరగతి పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిలయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారారు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే తపనతో తన కుమార్తె బి.సమీనాతో కలిసి పదో తరగతి పరీక్షలు రాశారు. షబ్బీర్కు 319, కుమార్తె సమీనాకు 309 మార్కులు రావడం విశేషం.
News April 23, 2025
రొంపిచర్ల: పదో తరగతి ఒకేసారి పాసైన తండ్రి, కూతురు

రొంపిచర్ల గ్రామపంచాయతీ పాలెం వీధికి చెందిన తండ్రి, కూతురు పదో తరగతి పరీక్షలు రాసి ఒకే సారి పాసైన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 1995-96 సంవత్సరంలో 10 పరీక్షలు రాసిన బి.షబ్బీర్ ఫెయిల్ అయ్యారు. అప్పట్లో ప్రమాదవశాత్తు గాయపడి దివ్యాంగుడిగా మారాడు. ఏదైనా ఉద్యోగం సాధించాలని కుమార్తెతో పాటు పదో తరగతి పరీక్షలు రాశాడు. తండ్రి బి.షబ్బీర్కు 319 మార్కులు, కుమార్తె బి.సమీనాకు 309 మార్కులు వచ్చాయి.
News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.