News July 11, 2024

తిరుపతి లాయర్‌కు స్టేట్ 5th ర్యాంక్

image

వారిది సాధారణ రైతు కుటుంబం. చిన్నప్పుడే తండ్రి మృతి చెందాడు. తల్లి, సోదరుడి ప్రోత్సహంతో మనుషా రాష్ట్ర స్థాయి PG లాసెట్‌లో ఐదో ర్యాంకు సాధించింది. పొదలకూరు(M) లింగంపల్లి గ్రామానికి చెందిన గుండ్రా మస్తాన్‌రెడ్డి, మాధవిల కుమార్తె పదో తరగతి వరకు పొదలకూరు బాలికల ZP హైస్కూల్లో చదివింది. తిరుపతి SVUలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి ఇక్కడే న్యాయవాదిగా పనిచేస్తోంది. న్యాయమూర్తి కావడమే లక్ష్యమని మనుషా పేర్కొంది.

Similar News

News October 15, 2025

కుప్పంలో క్షుద్ర పూజలు కలకలం

image

కుప్పం (M) నూలుకుంట గ్రామంలో క్షుద్ర పూజలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. మురుగప్ప ఆచారి ఇంటి గడప ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు ముగ్గేసి అందులో పసుపు కుంకుమతో పాటు నిమ్మకాయలు, కోడిగుడ్డు, తమలపాకులు, అగరవత్తులు పెట్టి పూజలు చేశారు. దీంతో మురుగప్ప కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

News October 15, 2025

చిత్తూరు: పర్యాటక అభివృద్ధి పై సమీక్ష

image

జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్, జిల్లా పర్యాటక మండల చైర్మన్ సుమిత్ కుమార్ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కైగల్ జలపాతం, పులిగుండు, కంగుంది ప్రాంతాలతో పాటు మొగిలి దేవాలయాలలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. ఐరాల బుగ్గ మడుగు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. డీఆర్వో మోహన్ కుమార్, ఆర్డీవో శ్రీనివాసులు, పర్యాటకశాఖ ఆర్డి రమణ పాల్గొన్నారు.

News October 15, 2025

కుప్పం RTC డిపో కోసం 15.37 ఎకరాలు

image

కుప్పం RTC డిపో ఏర్పాటుకు ప్రభుత్వం 15.37 ఎకరాలను కేటాయించింది. కుప్పం మున్సిపాలిటీ కమతమూరు రెవెన్యూ పరిధిలో 3.53 ఎకరాలు, గుట్టపల్లి రెవిన్యూ పరిధిలో 11.84 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆర్టీసీ డిపో కోసం కేటాయించిన భూమిని మంగళవారం DPTO రాము, ఆర్టీసీ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం కుప్పం ఆర్టీసీ డిపో బస్టాండ్ ఓకే చోటు ఉండగా ఆధునిక వసతులతో ఆర్టీసీ బస్టాండ్ తో పాటు డిపోను ఏర్పాటు చేయనున్నారు.