News February 14, 2025
తిరుపతి: లోకేశ్ను కలిసిన రాకేశ్ కుటుంబ సభ్యులు

ఏనుగుల దాడిలో మృతి చెందిన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉపసర్పంచ్ రాకేశ్ చౌదరి కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ను కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ వారితో మాట్లాడుతూ.. ఏనుగుల దాడిలో రాకేశ్ మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని వ్యాఖ్యానించారు. మృతుడి కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
Similar News
News November 5, 2025
VJA: బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా శ్రీకాకుళం(CHE)- బెంగళూరు కంటోన్మెంట్(BNC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.08553 CHE- BNC రైలు ఈ నెల 21న రాత్రి 11.35కి విజయవాడ, తర్వాత రోజు మధ్యాహ్నం 2.45కు BNC చేరుకుంటుందన్నారు. నం. BNC- CHE రైలు ఈ నెల 24న మధ్యాహ్నం 2కి బెంగళూరులో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7కు విజయవాడ, సాయంత్రం 5కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు.
News November 5, 2025
భార్యకు చిత్రహింసలు.. 86 ఏళ్ల వృద్ధుడికి జైలు శిక్ష

ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వృద్ధాప్యంలో ఓ వ్యక్తి భార్యపై క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. బంధువులను కలవనీయకుండా శారీరకంగా, మానసికంగా హింసిస్తూ అవమానించాడు. బాధలను తట్టుకోలేని ఆమె కోర్టుకు వెళ్లింది. దీంతో 86ఏళ్ల ధనశీలన్కు 6 నెలల జైలు శిక్ష, ₹5K ఫైన్ విధించింది. దీనిపై మరోకోర్టు స్టే విధించగా, శిక్ష కరెక్టేనని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. వివాహం అంటే బాధలను భరించడం కాదని చెప్పింది.
News November 5, 2025
పాలమూరు: టీచింగ్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ విడుదల

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed.) 2024-26 బ్యాచ్కు చెందిన మొదటి సంవత్సర ఫైనల్ లెసన్ టీచింగ్ ప్రాక్టికల్స్ (FLTP) రెండు దశల్లో నిర్వహించనున్నాయి. మొదటి దశ ఈనెల 10 నుంచి 14 వరకు, రెండో దశ ఈనెల 17 నుంచి 21 వరకు జరుగుతుందని విద్యార్థుల హాల్ టికెట్లు వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా ఈనెల 4 నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.


