News April 7, 2025

తిరుపతి: వివిధ పథకాలకు రూ.కోటి విరాళం

image

టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు రూ.కోటి విరాళంగా అందింది. ఈ మేరకు ఒడిశాకు చెందిన శివమ్ కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు రూ.20 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్టుకు రూ.10 లక్షలు, ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చింది.

Similar News

News November 26, 2025

కలెక్టరేట్‌కు ప్రభుత్వం ఒకపైసా మంజూరు చేయలేదు: శ్రీకాంత్ రెడ్డి

image

రెండేళ్ల క్రితమే రూ.100 కోట్ల నిధులతో అప్రూవ్ అయిన రాయచోటి కలెక్టరేట్‌కు కూటమి ప్రభుత్వం ఒక్కపైసా మంజూరు చేయలేదని YCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. అమరావతి నిర్మాణానికి పెట్టే ఖర్చులో 0.1 శాతం నిధులను కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టక పోవడం ఏంటని ప్రశ్నించారు. స్వార్థం లేకుండా, కేవలం రాయచోటిని మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి కృషి చేశానన్నారు.

News November 26, 2025

జగిత్యాలలో వృద్ధులకు జేరియాట్రిక్ వైద్య శిబిరం

image

ఈనెల 28న ఉదయం 9 గంటల నుంచి జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (పాత బస్ స్టాండ్)లో ప్రత్యేక జేరియాట్రిక్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు. వృద్ధులకు డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాలు, శ్వాసకోశ సమస్యలు, పక్షవాతం, మధుమేహం వంటి వ్యాధులకు ఉచిత చికిత్సతో పాటు ఫిజియోథెరపీ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు.

News November 26, 2025

జగిత్యాల: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ ఫీజు చెల్లించాలి

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల వార్షిక పరీక్షలు 2026 జనవరి/ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న నేపథ్యంలో 5 డిసెంబర్ 2025లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. ఫీజులు చెల్లించి పరీక్షలకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నారు. అప్లై చేసిన అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకుని జిల్లా విద్య అధికారి కార్యాలయంలో డిసెంబర్ 19 లోగా సమర్పించాలన్నారు.