News March 24, 2025
తిరుపతి: విహార యాత్రకు వస్తుండగా విషాదం

సెలవు రోజున సరదాగా గడుపుదామని ఉబ్బల మడుగు వస్తున్న తమిళనాడు వాసులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఆదివారం తడ వద్ద చోటు చేసుకుంది. పెరియా వట్టు వద్ద తమిళనాడు ప్రమాణికుల కారు ఓవర్ స్పీడ్ కారణంగా చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఫాతిమా, దీనా మృతి చెందారు. కాగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు చెన్నైలో చికిత్స అందిస్తున్నారు.
Similar News
News December 4, 2025
భద్రాద్రి: 3వ విడత తొలిరోజు అందిన నామినేషన్లు

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం 7 మండలాల నుంచి నామినేషన్లు స్వీకరించారు. మండలాల వారీగా బుధవారం అందిన సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్లు ఇలా. ఆళ్లపల్లి – 1, 2, గుండాల – 3, 3, జూలూరుపాడు – 5, 4, లక్ష్మీదేవిపల్లి – 4, 7, సుజాతనగర్ – 3, 1, టేకులపల్లి – 19, 7, ఇల్లందు – 6, 6.. 155 గ్రామపంచాయతీలకు గాను 41 సర్పంచ్, 30 వార్డు సభ్యులు నామినేషన్ దాఖలు చేశారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు
News December 4, 2025
థైరాయిడ్ ట్యూమర్స్ చికిత్స

థైరాయిడ్ ట్యూమర్స్ వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏ రకమైన కణితో తెలుసుకుంటారు. అలా తెలియకపోతే నీడిల్ ద్వారా కణితిలోని కొన్ని కణాలను బయటికి తీసి, మైక్రోస్కోప్లో పరీక్షిస్తారు. థైరాయిడ్ కణితి 3 సెం.మీ. కన్నా పెద్దగా ఉండి, ఆహారం తీసుకున్నప్పుడు ఇబ్బందికరంగా ఉంటే సాధారణంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్/ సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తారు.
News December 4, 2025
VZM: హోంమంత్రి అధ్యక్షతన నేడు DRC సమావేశం

విజయనగరం కలెక్టరేట్లో బుధవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్సీ) సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ వంగలపూడి అనిత అధ్యక్షత వహించనున్నారు. జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ శాఖల ప్రగతి, ప్రజా సేవల అమలు స్థితి, సంక్షేమ పథకాల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించనున్నారు.


