News March 24, 2025
తిరుపతి: విహార యాత్రకు వస్తుండగా విషాదం

సెలవు రోజున సరదాగా గడుపుదామని ఉబ్బల మడుగు వస్తున్న తమిళనాడు వాసులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఆదివారం తడ వద్ద చోటు చేసుకుంది. పెరియా వట్టు వద్ద తమిళనాడు ప్రమాణికుల కారు ఓవర్ స్పీడ్ కారణంగా చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఫాతిమా, దీనా మృతి చెందారు. కాగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు చెన్నైలో చికిత్స అందిస్తున్నారు.
Similar News
News November 23, 2025
జనగామ: నేడే ఎన్ఎంఎంఎస్ పరీక్ష..!

కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే రూ.12 వేల ఉపకార వేతనానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇందుకు జనగామ జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పర్యవేక్షణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్ లు, నలుగురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
News November 23, 2025
అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
News November 23, 2025
చిలకపాలెం-రాయగడ రోడ్డు పనులకు రేపు శంకుస్థాపన

చిలకపాలెం-రామభద్రపురం-రాయగడ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు పూర్తిగా పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుకు నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో బేబినాయన కోరడంతో రూ.4.50కోట్లు మంజూరయ్యాయి. గొర్లెసీతారాంపురం వద్ద శంకుస్థాపన చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


