News March 24, 2025

తిరుపతి: విహార యాత్రకు వస్తుండగా విషాదం

image

సెలవు రోజున సరదాగా గడుపుదామని ఉబ్బల మడుగు వస్తున్న తమిళనాడు వాసులు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ఆదివారం తడ వద్ద చోటు చేసుకుంది. పెరియా వట్టు వద్ద తమిళనాడు ప్రమాణికుల కారు ఓవర్ స్పీడ్ కారణంగా చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఫాతిమా, దీనా మృతి చెందారు. కాగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు చెన్నైలో చికిత్స అందిస్తున్నారు.

Similar News

News November 25, 2025

రంగారెడ్డి జిల్లా పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు

image

గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా.. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు ఉండగా.. ST జనరల్‌కు 49, ST మహిళలకు 42, SC జనరల్ 55, SC మహిళలకు 51, BC జనరల్‌కు 50, మహిళలకు 42, అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో మహిళలకు 112, పురుషులకు 125 స్థానాలు కేటాయించారు.

News November 25, 2025

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభం

image

GHMC సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు ఆయా పార్టీల MPలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మొత్తం 46 అజెండాలపై సమావేశంలో చర్చలు జరపనున్నారు. జూబ్లీహిల్స్ MLA మాగంటి, కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్, అందెశ్రీ మృతి పట్ల 2 నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు.

News November 25, 2025

KCR, KTR.. కాస్ట్‌లీ భూములు ఆక్రమించారు: ఫోరెన్సిక్ ఆడిట్‌

image

సిరిసిల్ల జిల్లాలో ధరణి పోర్టల్‌పై ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తైంది. జిల్లాలో ధరణి పోర్టల్ దుర్వినియోగంపై ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోంది. KCR, KTR, హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ధరణి పోర్టల్‌ సాయంతో ఖరీదైన భూములను ఆక్రమించారని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. తుది నివేదికను త్వరలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమర్పించనున్నారు.