News January 29, 2025
తిరుపతి: వైసీపీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్ రెడ్డి

తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ ఆభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 42వ డివిజన్ కార్పొరేటర్ శేఖర్ రెడ్డిని ఎంపిక చేసేందుకు కార్పొరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. 3వ తేదీ జరిగే ఎన్నికల్లో ఏకగ్రీవంగా శేఖర్ రెడ్డిని గెలిపించుకోవాలని తీర్మానించారు. కూటమికి మద్దతు తెలిపిన వారు హాజరుకాలేదు.
Similar News
News November 15, 2025
విజయవాడ: లవర్ బాయ్ మోసం.. పట్టుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువతి విజయవాడ బస్టాండ్ వద్ద ఏడుస్తూ ఉండగా కృష్ణలంక పోలీసులు ఆరా తీశారు. తాను శ్రీకాకుళం పట్టణానికి చెందిన మరో యువకుడితో కలిసి విజయవాడలో పెళ్లి చేసుకుందామని వచ్చామని తెలిపింది. యువకుడు తన వద్ద ఉన్న బంగారం, ఫోన్, నగదు తీసుకొని పారిపోయాడని వాపోయింది. వెంటనే పోలీసులు సాంకేతిక ప్రరిజ్ఞానంతో యువకుడు ఎక్కడున్నాడో తెలుసుకొని అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.
News November 15, 2025
జగిత్యాల: ‘ఈ నెల 30లోపు గణన పూర్తి చేయాలి’

జగిత్యాల కలెక్టరేట్లో 7వ చిన్నతరహా నీటి వనరుల గణన (2023-24), రెండో జలాశయాల గణనపై జిల్లా స్థాయి సమన్వయ సంఘం సమావేశం జరిగింది. అదనపు కలెక్టర్ బి.యస్. లత అధ్యక్షత వహించారు. ప్రధాన ప్రణాళిక అధికారి గుగ్గిళ్ల సత్యం గణన పూర్తిగా డిజిటల్ యాప్ ద్వారా నిర్వహించబడుతుందని, జూన్ 30 నాటికి గ్రామాలన్నింటిలో భూగర్భ, ఉపరితల జల వనరుల వివరాలు సేకరించాలని సూచించారు. ఈ నెల 30లోపు గణన పూర్తి చేయాలని మాట్లాడారు.
News November 15, 2025
భద్రాద్రి: లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహించారు. నేటి స్పెషల్ లోక్ అదాలత్ విజయవంతం అయిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. ఈ స్పెషల్ లోక్ అదాలతో 1,604 కేసులు పరిష్కారం అయ్యాయన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని, రాజీ కాదగిన కేసులను కక్షిదారులు సద్వినియోగం చేసుకున్నారని వెల్లడించారు.


