News March 31, 2025

తిరుపతి: శ్రీవారి భక్తుడు మృతి

image

ఈనెల 24న భూదేవి కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.

Similar News

News February 22, 2026

తిరుపతి: ముగిసిన ఐదో విడత ‘గరుడ అట్లాస్’

image

తిరుపతి పరిసర ప్రాంతాల్లో పక్షిజాతి వైవిధ్యాన్ని శాస్త్రీయంగా నమోదు చేసే గరుడ అట్లాస్ ఐదో విడత పూర్తైంది. 2022లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 274 పక్షిజాతులు నమోదు కాగా, ప్రస్తుత విడతలోనే 192 జాతులు గుర్తించారు. IISER తిరుపతి ఆధ్వర్యంలో, తిరుపతి నేచర్ సొసైటీ, అటవీ శాఖ సహకారంతో 72 గ్రిడ్‌లలో సర్వే నిర్వహించారు. పట్టణ విస్తరణ, భూ వినియోగ మార్పుల ప్రభావాలను అంచనా వేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

News February 22, 2026

కర్నూలులో బాక్సింగ్ రింగ్ సిద్ధం!

image

కర్నూలులో ఆదివారం జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలను జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (DSDO) భూపతి రావు ప్రారంభించారు. బాక్సింగ్ వంటి వ్యక్తిగత క్రీడల్లో ప్రతిభ చాటితే విద్యా, ఉద్యోగ రంగాల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. క్రీడలు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని DSDO అన్నారు.

News February 22, 2026

‘వాస్తు’ అనేది నమ్మకమా, మూఢనమ్మకమా?

image

వాస్తుశాస్త్రం నమ్మకమే కాదు! పంచభూతాల కలయిక అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘కులమతాలకు అతీతంగా ప్రకృతిని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ వాస్తు వర్తిస్తుంది. ప్రకృతి నియమాలు గౌరవించడమే వాస్తు అసలు ఉద్దేశం. గాలి, వెలుతురు వంటి సహజ వనరులను సమన్వయం చేస్తూ జీవిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. వాస్తు నియమాలు విస్మరిస్తే ఎవరికైనా ఇబ్బందులు తప్పవని నిపుణుల అభిప్రాయం’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>