News August 1, 2024

తిరుపతి: సాయంత్రం 4 గంటలకు 96.98% పెన్షన్ పంపిణీ

image

తిరుపతి జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు 96.98% పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ పంపిణీ వివరాలు ఇలా ఉన్నాయి: తిరుపతి(R)96.32, శ్రీకాళహస్తి(M)98.05, తిరుపతి(M)97.67, రేణిగుంట 96.79, చంద్రగిరి 96.74, వెంకటగిరి 97.21, నాయుడుపేట 97.58, వడమాల పేట 96.55 పంపిణీ చేసినట్లు తిరుపతి కలెక్టర్ యస్. వెంకటేశ్వర్ తెలిపారు.

Similar News

News January 1, 2026

చిత్తూరులో స్కాం.. అజ్ఞాతంలోకి వ్యాపారులు

image

జీఎస్టీ చీఫ్ కమిషనర్ ఆదేశాలతో చిత్తూరు జిల్లాలో జీఎస్టీ స్కాంపై అధికారులు చర్యలు మొదలుపెట్టారు. కలెక్టర్, ఎస్పీని మంగళవారం కలిసి కుంభకోణంపై చర్చించినట్లు తెలుస్తోంది. స్క్రాప్ స్కామర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీని, కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో సంబంధిత స్క్రాప్ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

News January 1, 2026

చిత్తూరు జిల్లాలో రూ.14 కోట్ల మందు తాగేశారు..!

image

చిత్తూరు జిల్లాలో డిసెంబరు 30న 7,500 బాక్సుల మద్యం, 2,500 బాక్సుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా రూ.5.05 కోట్ల ఆదాయం వచ్చింది. 31వ తేదీన 4,900 మద్యం, 2400 బీరు బాక్సులు అమ్మడంతో రూ.3.78 కోట్లు సమకూరింది. బార్లలో రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరగడంతో మొత్తంగా రెండు రోజులకు రూ.10.83 కోట్ల ఆదాయం చేకూరింది. జనవరి 1న రూ.2 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

News January 1, 2026

చిత్తూరు అగ్రికల్చర్ జేడీ రిటైర్మెంట్

image

ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ ఎంతో కీలకమని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలిపారు. చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ ఉద్యోగ విరమణ సన్మాన సభ జరిగింది. ఎమ్మెల్యే హాజరయ్యారు. జేడీగా ఆయన ఉత్తమమైన సేవలందించారని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం మురళీకృష్ణ దంపతులను సత్కరించారు.