News November 11, 2024

తిరుపతి: సైబర్ నేరాల పట్ల DGP అవగాహన

image

సైబర్ క్రైమ్, డ్రగ్స్, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ ద్వారకా తిరుమలరావు సోమవారం అవగాహన కల్పించారు. ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని సుమారు 900 పాఠశాలలు, 60 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. సైబర్ నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను DGP వివరించారు. మహిళా దాడులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు.

Similar News

News March 17, 2026

పాకాల: ఉదయాన్నే హైవేపై ప్రమాదం

image

పాకాల(M) నేండ్ర గుంట సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారెడ్డి ఆవుని తీసుకుని రోడ్డు దాటుచుండగా తిరుపతి వైపు వెళ్తున కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన రామకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2026

ద్రవిడ వర్సిటీ వీసీగా చిన్న మల్లయ్య బాధ్యతలు

image

కుప్పం ద్రవిడ వర్సిటీ వీసీగా ఆచార్య చిన్న మల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ఎకనామిక్స్ విభాగంలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న ఈయనను ప్రభుత్వం వీసీగా నియమించింది. ద్రవిడ వర్సిటీని విద్య పరిశోధన పరిపాలన రంగంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వీసీ తెలిపారు. వర్సిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

News March 16, 2026

సెలవులో చిత్తూరు కలెక్టర్

image

వ్యక్తిగత కారణాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సెలవు పెట్టారు. నేటి నుంచి ఈనెల 20వ తేదీ వరకు సెలవులో వెళ్తున్నారు. తిరిగి ఆయన 21న విధులకు హాజరుకానున్నారు. అప్పటి వరకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.