News March 19, 2025

తిరుపతి: హిందీ పరీక్షకు 272 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో రెండవ రోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26,413 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 272 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బుధవారం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

Similar News

News October 31, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: తుఫానుతో రూ.5,265 కోట్ల నష్టం: చంద్రబాబు
* తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన
* 15లక్షల ఎకరాల్లో పంట నష్టం: జగన్
* TG: వరద ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ పర్యటన
* దేశ ద్రోహానికి పాల్పడ్డ వ్యక్తి అజహరుద్దీన్: కిషన్ రెడ్డి
* ఎకరాకు రూ.10వేల చొప్పున సాయం: తుమ్మల
* సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్
* WWC: ఫైనల్ చేరిన టీమ్ ఇండియా

News October 31, 2025

ఎవరు గెలిచినా చరిత్రే

image

WWC <<18154615>>సెమీఫైనల్లో<<>> ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సౌతాఫ్రికాతో టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. నవి ముంబై వేదికగా నవంబర్‌ 2న ఫైనల్ జరగనుంది. భారత్‌, సౌతాఫ్రికా జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరల్డ్ కప్‌ గెలవలేదు. ఈసారి ఎవరు విజేతగా నిలిచినా అది ఆ జట్టుకు తొలి వరల్డ్‌కప్‌గా చరిత్రలో నిలుస్తుంది.

News October 31, 2025

జగిత్యాల: పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో మైనింగ్, క్వారీ లీజు రెన్యువల్ లేదా కొత్త లీజు మంజూరుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అధ్యయన సంస్థ (SEIAA) జారీ చేసే పర్యావరణ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రూపొందించిన డ్రాఫ్ట్ జిల్లా సర్వే నివేదికను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్‌సైట్‌లో (jagtial.telangana.gov.in) పొందుపరిచినట్లు ఆయన పేర్కొన్నారు.