News March 19, 2025
తిరుపతి: హిందీ పరీక్షకు 272 మంది గైర్హాజరు

తిరుపతి జిల్లాలో రెండవ రోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26,413 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 272 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బుధవారం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.
Similar News
News February 27, 2026
రేపు ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాల పరేడ్

ఎన్నో అద్భుతాలకు నిలయమైన ఆకాశంలో రేపు మరో మిరాకిల్ జరగనుంది. బృహస్పతి, బుధుడు, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని ఒకే వరుసలో కనువిందు చేయనున్నాయి. దీనిని గ్రహాల పరేడ్గా సైంటిస్టులు పేర్కొంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశం స్పష్టంగా ఉంటే పశ్చిమం వైపున బుధుడు, శుక్రుడు, బృహస్పతి, శని గ్రహాలను నేరుగా చూడవచ్చు. యురేనస్, నెప్ట్యూన్లను బైనాక్యులర్లు/టెలిస్కోప్తో వీక్షించవచ్చు.
News February 27, 2026
ఒకే వరుసలోకి గ్రహాలు.. ఇలా సాధ్యం

సౌర వ్యవస్థలో ప్రధానంగా 8 గ్రహాలున్నాయి. సూర్యుడి చుట్టూ ఓసారి తిరగడానికి బుధుడికి 88D, శుక్రుడికి 225D, భూమికి 365D, అంగారకుడికి 687D, జూపిటర్కి 12 ఎర్త్ ఇయర్స్, శనికి 29.5EY, యురేనస్కి 84EY, నెప్ట్యూన్కు 165EY పడుతుంది. వాటి వేగాలు, దూరాలను బట్టి కొన్ని గ్రహాలు అరుదుగా ఒకే వరుసలోకి వస్తాయి. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సూర్యుని వరుసలోకి రావడాన్ని సిజిగీ అంటారు.
* ఒక ఎర్త్ ఇయర్= 365 D
News February 27, 2026
తిరుపతిలో గరుడ వారధిపై యువకుడి మృతి

తిరుపతిలో గరుడ వారధిపై మరొకరు చనిపోయారు. తాతయ్యగుంటకు చెందిన ఆదం ద్వారక(23) తిరుచానూరులో జరిగిన వివాహానికి వెళ్లాడు. మరొకరితో కలిసి బైకుపై తిరిగి వస్తుండగా.. బ్లిస్ సర్కిల్ సమీపంలో గరుడ వారధిపై బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ద్వారక స్పాట్లోనే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడిన మరో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హేమాద్రి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


