News March 19, 2025

తిరుపతి: హిందీ పరీక్షకు 272 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో రెండవ రోజు పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26,413 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 272 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. బుధవారం ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు.

Similar News

News March 20, 2025

పాడేరు: ‘నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం’

image

నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యమని కలెక్టర్ దినేశ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ నుంచి నాటుసారా నివారణపై రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అక్రమ నాటుసారా తయారీదారులపై దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేయాలని సూచించారు. నాటుసారా నివారణకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రత్యేకాధికారులను నియమిస్తామన్నారు.

News March 20, 2025

IPL రూల్స్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం

image

IPLలో కొన్ని రూల్స్‌పై బీసీసీఐ BCCI కీలక నిర్ణయం తీసుకుంది. సలైవాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మి రుద్దుకోవచ్చని తెలిపింది. ఈ నిర్ణయం బౌలర్లకు కలిసొస్తుంది. అలాగే సెకండ్ ఇన్నింగ్స్‌లో 2 బంతులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. రెండో ఇన్నింగ్స్ 11 ఓవర్ల తర్వాత రెండో బంతిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను యథావిధిగా కొనసాగించనుంది.

News March 20, 2025

మహబూబ్‌నగర్: బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి 

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

error: Content is protected !!