News February 20, 2025

తిరుపతి: హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

image

తిరుపతి రూరల్ మండలం, రామంజపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని ఇద్దరు స్కూటీపై వెళ్తుండగా ఆర్‌సీ పురం జంక్షన్ నుంచి ఉప్పరపల్లి వైపు వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 23, 2025

వ్యవసాయ సంఘాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్ 

image

చిత్తూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో సహకార అభివృద్ధి కమిటీ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి పారదర్శకంగా రుణాలు మంజూరు చేసేందుకు దృష్టి సారించాలన్నారు. సహకార కేంద్ర బ్యాంక్ అభివృద్ధికి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. జేసీ విద్యాధరి, అధికారులు పాల్గొన్నారు.

News February 22, 2025

చిత్తూరు జిల్లాలో ఇలాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక.. ఏపీ CS, DGPకి నోటీసులు
✒ తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి
✒ వెదురుకుప్పంలో అగ్ని ప్రమాదం
✒ బెంగళూరు-చెన్నై హైవేపై ప్రమాదం
✒ చిత్తూరులో 19 మందికి జరిమానా
✒ తిరుపతి: ఒకే వేదికపై 100 మంది కవలలు
✒ వ్యవసాయ సంఘాల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

News February 22, 2025

తవణంపల్లి: లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

image

చంద్రగిరి మండలం కాశీపెంట్ల హెరిటేజ్ ఫ్యాక్టరీ వద్ద రెండు లారీల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తవణంపల్లి మండలం, మారేడుపల్లెకు చెందిన డ్రైవర్ సౌందర్ రాజు (35) గా గుర్తించారు. లారీని పార్క్ చేసి చూసుకొని క్రమంలో మరో లారీ ఢీకొనడంతో లారీల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న చంద్రగిరి పోలీసులు మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీకి తరలించారు.

error: Content is protected !!