News February 4, 2025

తిరుపతి: 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ జనరల్ విద్యార్థులు 24927 మంది ఉండగా 124 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకేషనల్ అభ్యర్థులు 2355 మంది 23 పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News November 4, 2025

ఇల్లందుకు బొగ్గుగడ్డగా పేరేలావచ్చిందంటే!

image

1870లో ఇల్లందులో బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. అప్పటి నుంచి స్థానికులు ఇల్లందును ‘బొగ్గుగడ్డ’గా పిలుస్తుంటారు. భద్రాద్రి రామయ్య భక్తుడి కారణంగా నల్ల బంగారం వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం ఎడ్లబండిపై రాములోరి గుడికి వెళ్తూ రాత్రి సమయంలో సింగరేణి, పూసనపల్లి సమీపంలో వంట కోసం అక్కడ నల్లటి రాళ్లను పొయ్యిగా అమర్చారు. రాళ్లు నిప్పు కణికలుగా మారడం, ఎంతకీ ఆరకపోవడంతో దక్కన్ కంపెనీ నిల్వలను గుర్తించింది.

News November 4, 2025

కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా..!

image

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం 14 మందికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కామారెడ్డి PS పరిధిలో ఓ వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. మరో 9 మందికి రూ.9 వేలు జరిమానాలు వేశారు. దేవునిపల్లి పరిధిలో ముగ్గురికి రూ.3 వేల చొప్పున జరిమానా, బీబీపేట్ పరిధిలోని ఓ వ్యక్తికి రూ.వెయ్యి జరిమానాలు విధించింది.

News November 4, 2025

నేటి నుంచి బుగులోని వెంకన్న జాతర ప్రారంభం

image

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో ఎడ్ల బండ్లపైన చేరుకుంటారు. నేడు స్వామివారిని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా కొండ వద్దకు తీసుకుస్తారు. దీంతో జాతర వైభవం లాంఛనంగా ప్రారంభం కానుంది.