News February 4, 2025
తిరుపతి: 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ జనరల్ విద్యార్థులు 24927 మంది ఉండగా 124 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకేషనల్ అభ్యర్థులు 2355 మంది 23 పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
ధర్మపురి: జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు: ఎస్పీ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలను ముమ్మరంగా చేపట్టనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపట్నం చెక్ పోస్టును, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ రావు పేట పోలింగ్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా అనుచిత చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 6, 2025
తిరుపతిలో 10వ తేదీన ఇంటర్వ్యూలు

శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS)లో 10వ తేదీన వివిధ పోస్టులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కార్యాలయం పేర్కొంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టు -04, న్యూక్లియర్ మెడిసిన్ రేడియో ఫార్మసిస్ట్-01 మొత్తం 5 పోస్టులకు అవకాశం ఉంది. అర్హత, ఇతర వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs.html వెబ్సైట్ చూడొచ్చు.


