News February 4, 2025

తిరుపతి: 5 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ జనరల్ విద్యార్థులు 24927 మంది ఉండగా 124 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒకేషనల్ అభ్యర్థులు 2355 మంది 23 పరీక్ష కేంద్రాల్లో ప్రాక్టికల్స్ జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

Similar News

News February 18, 2025

ఈ ప్రాంతాల్లో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు

image

గ్రేటర్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయాయని తెలిపిన భూగర్భజల శాఖ అధికారులు లిస్ట్ విడుదల చేశారు. ఎర్రగడ్డ, చంద్రాయణగుట్ట, మేడిపల్లి, హస్మత్‌పేట, యాప్రాల్, ఫతేనగర్, దూలపల్లి, శంభిపూర్, చెంగిచెర్ల, గుండ్ల పోచంపల్లి, మేడిపల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, ఉప్పల్, పటాన్‌చెరు, రామంతపూర్, రామచంద్రపురం ప్రాంతంలోనూ 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి.

News February 18, 2025

కుంభమేళా పొడిగింపు..? యూపీ సర్కారు జవాబు ఇదే

image

భక్తుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మహా కుంభమేళాను మరో రెండు రోజుల పాటు పొడిగిస్తారంటూ వస్తున్న వార్తలపై యూపీ సర్కారు స్పందించింది. అలాంటి ఆలోచనలేవీ లేవని తేల్చిచెప్పింది. ముందుగా చెప్పినట్లుగానే ఈ నెల 26న మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని వివరించింది. తాము అధికారికంగా చెబితే తప్ప.. సోషల్ మీడియాలో వచ్చే వదంతుల్ని నమ్మొద్దని సూచించింది.

News February 18, 2025

బిచ్కుంద : పిగ్ మీ పేరిట ఘరానా మోసం

image

బిచ్కుంద మండల కేంద్రంలోని కెనరా బ్యాంకులో తాత్కాలికంగా దరఖాస్తులు రాసుకుంటూ ఉపాధి పొందుతున్న జంగం రాజు అనే వ్యక్తి ఖాతాదారులను పిగ్ మీ పేరిట భారీగా డిపాజిట్ల సేకరించారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు అధికారులను నిలదీయగా తమకు సంబంధం లేదని తేల్చేశారు. మోసం చేసిన వ్యక్తి కుటుంబంతో సహా పరారైయ్యాడు. రూ.60 లక్షలు స్వాహా చేశాడని బాదితులు ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!