News February 7, 2025
తిరుపతి: 66 ఉద్యోగాలకు దరఖాస్తులు

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికగా ఎస్వీ మెడికల్ కళాశాల, రుయా హాస్పిటల్, పద్మావతి నర్సింగ్ కాలేజ్, గవర్నమెంట్ మెటర్నరీ హాస్పిటల్లలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. 19 విభాగాలలో .. 66 ఖాళీలు ఉన్నట్లు సూచించారు. అర్హత, ఇతర వివరాలకు https://tirupati.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 22.
Similar News
News February 26, 2026
కామారెడ్డి: ఓడిన వారికి అప్పులే!

ఎన్నికల జాతర ముగిసింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమకున్న స్థలాలు తాకట్టు పెట్టారు. నమ్మబలికిన ఓటర్ల మాటలు నమ్మి లక్షల రూపాయలు గుమ్మరించారు. గెలుపుపై ధీమా కల్పించిన నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అభ్యర్థులను గాలికి వదిలేసి గెలిచిన వారి చెంతకు చేరుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. డబ్బుతో ఓట్లను కొనే వ్యవస్థ ఉన్నంత కాలం ఇలాంటి విషాదాలు పునరావృతమవుతూనే ఉంటాయి.
News February 26, 2026
మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్గా హరిప్రియ

ఉమ్మడిజిల్లాలో రెవెన్యూశాఖ అధికారులు బదిలీఅయ్యారు. మేడ్చల్ DROగా విధులు నిర్వహిస్తున్న JLB హరిప్రియను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్గా నియమితులయ్యారు. వెయిటింగ్లో ఉన్న అదనపుకలెక్టర్ పద్మజారాణి గద్వాల DROగా నియమితులయ్యారు. గద్వాల హౌసింగ్ PDగా పనిచేస్తున్న శ్రీనివాసరావు RDOగా నియామకం కాగా, RDOగా పనిచేస్తున్న అలివేలు హౌసింగ్ PDగా నియమితులయ్యారు.
News February 26, 2026
మార్చి 14న పిడుగురాళ్లలో జాతీయ లోక్ అదాలత్

మార్చి 14న పిడుగురాళ్లలోని సివిల్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సివిల్ కోర్టు జడ్జి టి.ప్రవళిక బుధవారం తెలిపారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. పిడుగురాళ్ల కోర్టు పరిధిలోని కక్షిదారులు రాజీ పడవలసిన కేసులు, చెక్ బౌన్స్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ తగాదాలు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.


