News February 1, 2025
తిరుపతి: 95.68 శాతం పంపిణీ పూర్తి

తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ శనివారం 95.68 శాతం పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. 97.12 శాతంతో తిరుపతి మున్సిపాలిటీ తొలి స్థానంలో ఉండగా.. 93.2 శాతంతో వాకాడు చివరి స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే తిరుపతి జిల్లా 95.68 శాతంతో రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది.
Similar News
News October 19, 2025
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.137 నుంచి రూ.144, మాంసం రూ.199 నుంచి 215 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.226 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.195 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News October 19, 2025
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: అనకాపల్లి ఎస్ఐ

అనకాపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పిసినికాడ జాతీయ రహదారి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనకాపల్లి రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. మృతుని వయసు 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News October 19, 2025
MDK: ఈనెల 23 వరకు గడువు.. 27న డ్రా

ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. శనివారం ఉదయం నుంచే అభ్యర్థులతో ఎక్సైజ్ కార్యాలయాలు కిటకిటలాడాయి. మెదక్ జిల్లాలో(49 షాపులు) 1,350, సిద్దిపేట(93)లో 2,518, సంగారెడ్డి(101)లో 4,012 దరఖాస్తులు వచ్చాయి. కాగా షాపులకు దరఖాస్తుల గడువును ఈనెల 23 వరకు పొడిగించడంతో దరఖాస్తుల సంఖ్యం ఇంకా పెరగనున్నాయి. ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపుల డ్రా తీయనున్నట్లు చెప్పారు.