News January 26, 2025

తిరుపతి: PHOTO OF THE DAY

image

తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద వెలసిన శ్రీవకుళ మాత ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం అద్భుతం చోటు చేసుకుంది. ఆకాశంలోని మేఘాలు నారింజ రంగు వర్ణంలో ప్రకాశిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీవారి మాతృమూర్తి వకుళ ఆలయంపై వియ్యంకుడు ఆకాశరాజు ఇలా విచ్చేశాడా అన్నంత అందంగా ఉండటంతో ఆ సుందర మనోహర దృశ్యాలను భక్తులు, స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.

Similar News

News October 19, 2025

జూబ్లీ బరిలో ఎవ్వరూ తగ్గట్లేదుగా

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాజకీయం హీటెక్కుతోంది. వచ్చేనెల 11న జరిగే ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రచారం జోరుపెంచాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ 40 మందిని ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లను నియమించగా గులాబీ దళం నుంచి 60 మందిని నియమించింది. ఇరు పార్టీలు కీలకనేతలకు ప్రచార బాధ్యతలు అప్పగించాయి. రాష్ట్ర రాజకీయాలు గ్రౌండ్‌ లెవల్‌కు వచ్చాయనే చర్చ నడుస్తోంది.

News October 19, 2025

నేడు వేములవాడ రాజన్న దర్శనాలపై క్లారిటీ..?

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరుకానున్నారు. ఈ రోజు సాయంత్రం రాజన్న దర్శనంపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిరోజులుగా రాజన్న దర్శనాలపై సందిగ్ధత నెలకొంటున్న విషయం తెలిసిందే.

News October 19, 2025

HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్‌ పేరుతో మోసం

image

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్‌ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్‌ ఐటీ ఇంజినీర్‌ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్‌డీ లెటర్‌హెడ్‌లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్‌కు బదిలీ చేశారు.