News January 26, 2025
తిరుపతి: PHOTO OF THE DAY

తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద వెలసిన శ్రీవకుళ మాత ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం అద్భుతం చోటు చేసుకుంది. ఆకాశంలోని మేఘాలు నారింజ రంగు వర్ణంలో ప్రకాశిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. శ్రీవారి మాతృమూర్తి వకుళ ఆలయంపై వియ్యంకుడు ఆకాశరాజు ఇలా విచ్చేశాడా అన్నంత అందంగా ఉండటంతో ఆ సుందర మనోహర దృశ్యాలను భక్తులు, స్థానికులు తమ సెల్ ఫోన్లలో బంధించారు.
Similar News
News February 10, 2025
రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ప్రజావాణి కార్యక్రమం వాయిదా
> జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన స్టేషన్ ఘనపూర్ విద్యార్థులు
> షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పెంచాలి: కడియం
> తప్పుడుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని NSUI నేతల డిమాండ్
> ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
> సోమేశ్వరాలయానికి అరకిలో వెండి పూర్ణకుంభం అందజేత
News February 9, 2025
భూపాలపల్లి జిల్లా పరిధి నేటి ముఖ్యాంశాలు

✓ కాళేశ్వరం మహాకుంబాభిషేకం ఉత్సవాలకు హాజరైన మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ✓ మహాదేవపూర్ చెరువులో పడి వ్యక్తి మృతి✓ రేగొండలో అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు✓ ధన్వాడ దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు✓ గణపురం కోటగుళ్లలో సందడి చేసిన పాఠశాల విద్యార్థులు✓ చిట్యాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు