News February 3, 2025

తిరుపతి: PIC OF THE DAY 

image

కులమతాలకు అతీతంగా శ్రీకాళహస్తిలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మతసామరస్యానికి అతీతంగా ఓ ముస్లిం మహిళ వసంత పంచమి రోజున తన బిడ్డకు మఠాధిపతి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించింది.  హిందూ, ముస్లిం ఐక్యతకు ఈ చిత్రం ప్రతీకగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. 

Similar News

News November 27, 2025

జాతీయస్థాయి పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా!

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల(EMRS) విద్యార్థులకు నిర్వహించిన జాతీయ స్థాయి వాల్యూ ఎడ్యుకేషన్ ఒలంపియడ్ పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది విద్యార్థులు విజయం సాధించగా, AP నుంచి తమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి కొర్ర గౌతమ్ 3వ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ అమిత్ ఆనంద్ తెలిపారు. గౌతమ్.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా బహుమతి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

News November 27, 2025

‘పరకామణి’తో నాకు సంబంధం లేదు: YV సుబ్బారెడ్డి

image

తిరుపతి పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని YV సుబ్బారెడ్డి అన్నారు. ఈ అంశంపై రేపు విజయవాడలో CID విచారణకు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పన్న గతంలో తనకు PA మాత్రమే అని ఆ తర్వాత అతనితో తనకు సబంధం లేదని స్పష్టం చేశారు. TTD వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని, అదే విషయం సిట్‌కు చెప్పానన్నారు.

News November 27, 2025

నల్గొండ: రేపటితో ముగుస్తున్న ఎంజీయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

ఎంజీయూ పరిధిలో ఈ నెల 13 నుంచి ప్రారంభమైన డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 పరీక్షలు రేపటితో ముగుస్తాయని డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఇప్పటికే ఈ సెమిస్టర్లకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీలను విడుదల చేసినట్లు తెలిపారు. డిసెంబర్లో సెమిస్టర్ 2, 4, 6 తరగతులు ప్రారంభిస్తామని రిజిస్టార్ పేర్కొన్నారు.