News February 3, 2025

తిరుపతి: PIC OF THE DAY 

image

కులమతాలకు అతీతంగా శ్రీకాళహస్తిలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మతసామరస్యానికి అతీతంగా ఓ ముస్లిం మహిళ వసంత పంచమి రోజున తన బిడ్డకు మఠాధిపతి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించింది.  హిందూ, ముస్లిం ఐక్యతకు ఈ చిత్రం ప్రతీకగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. 

Similar News

News November 26, 2025

పెద్దపల్లి: దీక్ష దివస్‌పై బీఆర్‌ఎస్ నాయకుల సమీక్ష

image

‘దీక్ష దివస్’ సందర్భంగా పెద్దపల్లి బీఆర్‌ఎస్ పార్టీ భవన్‌లో కేటీఆర్ ఆదేశాల మేరకు నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధ్యక్షత వహించగా, దాసరి మనోహర్ రెడ్డి ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ దీక్షలు పునాది అయ్యాయని మనోహర్ రెడ్డి గుర్తుచేశారు. ఈ సమావేశంలో పుట్ట మధు, రఘువీర్ సింగ్, గంట రాములు యాదవ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

News November 26, 2025

ప్రకాశం: తుఫాన్‌ను లెక్కచేయని వనిత.. అసలు స్టోరీ ఇదే!

image

నాగులుప్పలపాడు మండలం పోతవరానికి చెందిన మహిళా రైతు వనిత.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 2021 నుంచి ఇదే పద్ధతి పాటిస్తున్న ఆమె అద్భుత విజయాలు సాధించారు. ప్రస్తుతం మొక్కజొన్న, కంది, బీరకాయ పంటలను 2.20 ఎకరాల భూమిలో సాగు చేశారు. మొన్న మొంథా తుఫాన్‌తో మిగిలిన రైతుల పంట దెబ్బతింటే, ఈమె పంట సేఫ్. దీంతో రూ.8500 పెట్టుబడి ఖర్చుకు రూ.53,460 ఆదాయం గడించారు.

News November 26, 2025

భద్రాద్రిలో బీసీలకు ఛాన్సే లేదు..!

image

జీఓ నెం.46 విడుదల చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం సరైన పద్ధతి కాదని బీసీ జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం అమరవీరుల స్థూపం వద్ద నిరసన తెలిపి ఆయన మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో బీసీలకు ఒక్క సర్పంచ్ సీటు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యేంతవరకు ఎన్నికలు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.