News August 21, 2024

తిరుపతి SVU ఫీజులపై మీ కామెంట్..!

image

తిరుపతి ఎస్వీయూ పరిధిలోని బీఈడీ విద్యార్థులు ప్రతి రికార్డుకు రూ.2500 కట్టేలా ప్రస్తుతం నిబంధన ఉంది. దీనిని రద్దు చేయాలని NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెన్నే మల్లికార్జున కోరారు. ఈ మేరకు ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. పాత పద్ధతిలోనే ఒక సెమిస్టర్‌కు రూ.2500 ఫీజు కట్టించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు. మరి దీనిపై మీ కామెంట్.

Similar News

News November 16, 2025

చిత్తూరు DRO కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలోని మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి బుధ, గురువారాల్లో HODలతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని DRO మోహన్ కుమార్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఇతర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్పెషల్ అధికారులతో ఆయన శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్థాయి గ్రీవెన్స్‌ల పరిష్కారంపై దృష్టిసారించి నివేదిక సమర్పించాలన్నారు. ప్రజలకు నాణ్యమైన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 15, 2025

పవన్ పర్యటనతో ఒరిగిందేమి లేదు: వేంకటే గౌడ

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరు పర్యటన వల్ల ప్రజలకు, రైతులకు ఒరిగిందేమి లేదని మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ మండిపడ్డారు. ఏనుగుల క్యాంపునకు వచ్చిన ఆయన ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించి ఉంటే వారి బాధలు తెలిసేవన్నారు. కనీసం ఏనుగు దాడిలో గాయపడ్డ సుకుమార్ పక్కనే ఉన్నా పలకరించలేదన్నారు. పార్టీ క్యాడర్ కూడా లోపలికి రానివ్వకపోవడం దారుణమన్నారు.

News November 15, 2025

కుప్పం: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలోని DK పల్లి రైల్వే గేట్ వద్ద శుక్రవారం రాత్రి రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఛిద్రం కావడంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సంబంధించిన వివరాలు ఎవరికైనా తెలిస్తే 9000716436, 80740 8806 నంబర్‌కి సమాచారం తెలియజేయాలని రైల్వే పోలీసులు తెలిపారు.