News January 26, 2025
తిరుపతి: TTD రూ.27 లక్షల పరిహారం చెల్లింపు

తోపులాటలో మృతి చెందిన కేరళ రాష్ట్రం పాలక్కాడ్కు చెందిన వి.నిర్మల కుటుంబానికి రూ.27 లక్షల పరిహారాన్ని టీటీడీ బోర్డు సభ్యులు శనివారం అందజేశారు. టీటీడీ పాలక మండలి నిర్ణయం మేరకు రూ.25 లక్షలు, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సొంత నిధులు రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.27 లక్షలు అందజేశారు. మృతురాలు నిర్మల ఏకైక కుమార్తె కౌశిగాకు పరిహారం చెక్ను అందించారు.
Similar News
News November 7, 2025
MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.
News November 7, 2025
HYD: వీళ్లేం సెలబ్రెటీలు: సీపీ సజ్జనార్

అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని రైనా, ధవన్ను ఉద్దేశించి Xలో సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్స్కు వ్యసనపరులై వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడటానికి వీరు బాధ్యులు కారా అని ప్రశ్నించారు. ‘సమాజం, యువత మేలు కోసం నాలుగు మంచి మాటలు చెప్పండి. అంతేకానీ అభిమానులను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి’ అని రాసుకొచ్చారు.
News November 7, 2025
వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక: ఎస్పీ

కాకినాడ: స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణగా నిలిచిన ‘వందేమాతరం’ గీతం రచనకు ఈ రోజుతో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వందేమాతరం గీత రచయిత బంకించంద్ర చటర్జీ, భారతమాత చిత్రపటాలకి ఎస్పీ, పోలీస్ అధికారులు పుష్పాంజలి సమర్పించారు. వందేమాతరం గీతం దేశభక్తి స్ఫూర్తికి ప్రతీక అని వారు అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.


