News October 4, 2024
తిరుమలకు చేరుకున్న మంత్రి ఆనం

సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం శ్రీవారికి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. ఆయనను టీటీడీ ఈవో శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మర్యాదపూర్వకంగా కలిసి ఏర్పాట్లను వివరించారు.
Similar News
News December 22, 2025
నెల్లూరు: అన్నీ వాట్సాప్లోనే..!

నెల్లూరు జిల్లాలో చాలా ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ మిత్ర ద్వారా అన్ని సేవలు అందిస్తోంది. ప్రజలు 9552300009 నంబర్ సేవ్ చేసుకుని వాట్సాప్లో హాయి అని పెడితే మీకు కావాల్సిన సేవలు చూపిస్తుంది. కొత్త రేషన్ కార్డులు, అందులో మార్పులు, చేర్పులకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. 73373 59375 నంబర్కు రైతులు కాల్ చేస్తే ధాన్యం కొనుగోలు వివరాలు సైతం తెలుసుకోవచ్చు.
News December 22, 2025
నెల్లూరు: ఇద్దరు బీటెక్ యువకుల మృతి

నెల్లూరు రూరల్ కొత్త LNTకి చెందిన యుగంధర్ రెడ్డి(21) గూడూరు నారాయణ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి శ్రీనివాససత్రం బీచ్కు వెళ్లాడు. అలల తాకిడికి యుగంధర్ రెడ్డి కొట్టుకెళ్లి చనిపోయాడు. అలాగే నెల్లూరు సిటీకి చెందిన హర్షసాయి(19) ఒంగోలులో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఫ్రెండ్స్తో కొత్తపట్నం బీచ్కు వెళ్లాడు. అలల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి హర్షసాయి వెళ్లి చనిపోయాడు.
News December 22, 2025
మీ చిన్నారికి పోలియో చుక్కలు వేయించారా.?

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు 96.12 శాతం మంది చిన్నారులకు సిబ్బంది పోలియో చుక్కలు వేశారు. మొత్తం 2,94,604 మందికిగాను 2,83,173 మంది పిల్లలకు చుక్కల మందు ఇచ్చారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికి తిరిగి ఇవ్వనున్నారు. మరి మీ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారా.?


